లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైనికుడిని భారత ఆర్మీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం చుమార్-డెమ్చోక్ ప్రాంతంలో అతడిని పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అతడు అప్రయత్నంగా బార్డర్లోకి చొరబడ్డాడా..? లేక మరేరైనానా.? అనే విషయంలో విచారిస్తున్నట్లు చెప్పారు. సైనిక ప్రొటోకాల్ ప్రకారం సరైన ప్రక్రియలు నిర్వహించి ఆ తరువాత అతడిని చైనాకు అప్పటించనున్నట్లు తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా భారత్, చైనాల మధ్య జరుగుతున్న యుద్ధవాతావరణంలో భాగంగా చైనా సైనికుడిని అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.