spot_img
Homeఆంధ్రప్రదేశ్‌ఒక్కటైన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్.. జగన్ కు చావోరేవో

ఒక్కటైన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్.. జగన్ కు చావోరేవో


ఏపీ సీఎం జగన్ ప్రతిష్టకు ఇప్పుడు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం సవాల్ గా మారింది. జగన్ కు చావో రేవోలాగా మారింది. ఇజ్జత్ కా సవాల్ గా మారిన ఈ ఇష్యూలో సుప్రీం కోర్టు ఏం తీర్పునిస్తుందన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది.

ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. చంద్రబాబు ప్రభుత్వంలో నియామకమైన ఈయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆయనను తొలగించారు. ఆర్డినెస్స్ తీసుకొచ్చి మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను నియమించారు. అయితే హైకోర్టు దాన్ని కొట్టివేసి నిమ్మగడ్డనే ఏపీ ఎన్నికల కమిషనర్ అని ప్రకటించింది. దీంతో జగన్ దీనిపై సుప్రీం కోర్టులో సవాల్ చేయడంతో రసకందాయంలో ఈ వివాదం పడింది.

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఇప్పుడు చివరి అంకానికి చేరింది. హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈనెల 10న ఈ పిటీషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టబోతోంది. దీంతో ఈ నిమ్మగడ్డ వ్యవహారంలో జగన్ గెలుస్తాడా? నిమ్మగడ్డ విజయం సాధిస్తాడా? మళ్లీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ వస్తే మాత్రం జగన్ కు ఇంతకంటే ఘోరమైన అవమానం ఉండదని రాజకీయ అనలిస్టులు చెబుతున్నారు.

ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేసింది. ఈనెల 10న ఈ లీవ్ పిటీషన్ ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డే సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించబోతోంది. ఏపీ ప్రభుత్వం తరుఫున అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదనలు వినిపిస్తారు.

ఇక ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే నిమ్మగడ్డకు మద్దతుగా బీజేపీ నేత కామినేని శ్రీనివాస్, కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ, టీడీపీ నేత వర్ల రామయ్య సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వీటన్నింటిని సుప్రీంకోర్టు ఈనెల 10న విచారించనుంది. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటై నిమ్మగడ్డకు సపోర్టుగా సుప్రీం కోర్టులో నిలబడడం హాట్ టాపిక్ గా మారింది.ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భవితవ్యం విషయంలో సుప్రీం కోర్టు ఎలాంటి ఆదేశాలను ఇస్తుందనేది ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version