Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: మళ్లీ ముహూర్తం పెట్టిన జగన్.. రాజధాని తరలిస్తారా?

CM Jagan: మళ్లీ ముహూర్తం పెట్టిన జగన్.. రాజధాని తరలిస్తారా?

CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ పరిపాలనలో తనదైన ముద్ర చూపిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. ఎక్కడ కూడా అవినీతి ఉండకూడదని అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందుకు గాను అధికారుల్లో జవాబుదారీ తనం ఉండాలని సూచిస్తున్నారు. కానీ రాజధాని విషయంలో మాత్రం ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు. అమరావతి రాజధానిగా చేసిన చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించిన జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చి అందరిని అయోమయానికి గురిచేశారు. కానీ ప్రస్తుతం తాడేపల్లి నుంచే తన సేవలు కొనసాగిస్తున్నారు.
CM Jagan
పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలని నిర్ణయించినా అది కుదరడం లేదు. కేసు కోర్టులో పెండింగులో ఉన్నందున జగన్ నిర్ణయాలేవీ అమలు కావడం లేదు. ఫలితంగా ఆయన హామీ నీటిమూటగానే మిగిలిపోతోంది. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా చేస్తానని ఇచ్చిన హామీ నేటికి కూడా నెరవేరడం లేదు. తాడేపల్లి నుంచి విశాఖకు పరిపాలన రాజధానిని మారుస్తారని వార్తలు వస్తున్నా ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఫలితంగా ప్రజల్లో కూడా ఆశలు నీరుగారుతున్నాయి.

గత మున్సిపల్ ఎన్నికల్లోనే విశాఖకు మార్చాలని నిర్ణయించినా సాధ్యం కావడం లేదు. విశాఖ బీచ్ లో ఓ భవనాన్ని చూశారని ఇక తరలింపు తరువాయే అని వార్తలు వచ్చినా తరువాత అవి వట్టివే అతి తేలిపోయాయి. దీంతో జగన్ తప్పనిసరి పరిస్థితుల్లో తాడేపల్లి నుంచే తన సేవలు కొనసాగిస్తున్నారు. దీంతో మూడు రాజధానుల వ్యవహారం కాస్త వెనుకబడినట్లే అనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రతిసారి పండుగల తర్వాత తరలిస్తామని ముహూర్తం పెట్టుకుంటున్నా అది నెరవేరడం లేదు.

అమరావతి రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉన్నందున సీఎం జగన్ ఏ నిర్ణయం కూడా తీసుకోవడం లేదు. ఫలితంగా ప్రజల్లో కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు మూడు రాజధానుల వ్యవహారం కొలిక్కి వస్తుందనే అనే సందేహాలు కూడా అందరిలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని తరలింపు ఆలస్యమవుతుంటే అసలు ఇది సాధ్యం కాదేమోననే సంశయాలు రావడం సహజమే.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version