Homeజాతీయ వార్తలుIndian Currency History: భారత కరెన్సీ నోట్లపై గాంధీ కన్నా ముందు ఎవరి ఫొటో ఉండేదో...

Indian Currency History: భారత కరెన్సీ నోట్లపై గాంధీ కన్నా ముందు ఎవరి ఫొటో ఉండేదో తెలుసా.. చరిత్ర ఇదీ

Indian Currency History: భారత దేశాన్ని అనేక మంది రాజులు పాలించారు. తర్వాత ముస్లింలు భారత్‌పై దండయాత్ర చేశారు. తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. వీరు కూడా శతాబ్దాలు పాలించారు. తర్వాత బ్రిటిషర్లు వచ్చారు. సుమారు 200 ఏళ్లు అఖండ భారత దేశాన్ని పాలించారు. హిందూ రాజులు.. ఇస్లాం నవాబులు పాలించిన కాలంలో వస్తు మార్పిడి విధానం.. తర్వాత నాణేలు కరెన్సీ రూపంలో వాడేవారు. బ్రిటిష్‌ కాలంలో కూడా కొన్నేళ్లు నాణేలు ముద్రించారు. లోహాల విలువ పెరగడంతో కరెన్సీ ముద్రణను ప్రారంభించారు. అంటే బ్రిటిష్‌ పాలన కాలంలో భారతదేశంలో కరెన్సీ నోట్ల ముద్రణ ప్రారంభమైంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 1935లో స్థాపితమై, నోట్ల ముద్రణ బాధ్యతను స్వీకరించింది. ఈ నోట్లు బ్రిటిష్‌ రాజు, గద్ద బొమ్మలతో అలంకరించబడ్డాయి, ఇవి ఆనాటి రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించాయి. వంద రూపాయల నోటు ఈ చిత్రాలతో ప్రత్యేకంగా గుర్తించబడింది, అయితే రూపాయి, పది రూపాయల నోట్లపై మహాత్మా గాంధీ చిత్రం లేకపోవడం గమనార్హం. బదులుగా, ఈ నోట్లపై మూడు సింహాల గుర్తు ముద్రించబడేది, ఇది భారతదేశ సాంస్కృతిక గుర్తింపును సూచించేది.

Also Read: వీఎస్ అచ్యుతానందన్ జీవితం.. ఒక పోరాట యోధుడి ప్రస్థానం!

రంగురంగుల నోట్లు…
ఆనాటి కరెన్సీ నోట్లు తమ రంగురంగుల రూపంతో ప్రజల దృష్టిని ఆకర్షించాయి. రెండు రూపాయల నోటుపై శాటిలైట్, బెంగాల్‌ టైగర్‌ చిత్రాలు ముద్రించబడ్డాయి, ఇవి ఆధునికత, పర్యావరణ సంరక్షణను సూచించాయి. ఐదు రూపాయల నోటుపై ట్రాక్టర్, జింక బొమ్మలు ఉండేవి, ఇవి వ్యవసాయం. వన్యప్రాణుల పట్ల భారతదేశ గౌరవాన్ని తెలియజేసేవి. ఇక ఇరవై రూపాయల నోటు పింక్, రెడ్‌ రంగుల మిశ్రమంతో అరుదైన రంగుతో ముద్రించేవారు.

Also Read: భారత ప్రభుత్వం చేతుల్లోకి బీసీసీఐ.. వస్తే ఏం జరుగుతుంది?

అరుదైన రూ.10,000 నోటు కూడా..
1935లో బ్రిటిష్‌ పాలకులు రూ.10,000 నోటును ప్రవేశపెట్టారు, ఇది ఆ కాలంలో అత్యంత విలువైన కరెన్సీ నోటుగా గుర్తించబడింది. ఈ నోటు తొమ్మిదేళ్లు అమలులో ఉంది. స్వాతంత్య్రం తర్వాత, ఆర్‌బీఐ 1954లో కూడా రూ.10,000, రూ.5,000, రూ.1,000 నోట్లను ముద్రించింది. అయితే, నకిలీ నోట్ల సమస్య పెరగడంతో ఈ ఉన్నత విలువ నోట్లను రద్దు చేయాల్సి వచ్చింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version