Rajinikanth Tweet Reaction Vijay TVK Issue: తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన చుట్టూ రోజుకో వివాదం అలుముకుంటోంది. ఎక్కడ చూసిన ఆయన గురించే చర్చ. నిన్న మొన్నటి వరకు ప్రముఖ హీరోయిన్ త్రిష తో ఆయనకు ఉన్న అక్రమ సంబంధం , అదే విధంగా భార్య సంగీత విడాకుల వ్యవహారం లో తీవ్రమైన విమర్శలను ఎదురుకుంటూ వచ్చాడు విజయ్. సొంత అభిమానులు సైతం ఆయన చర్యలు తప్పుబట్టారు. ఇప్పుడు ఆయన TVK పార్టీ ప్రధాన కార్యదర్శి అదువ్ అర్జున సూపర్ స్టార్ రజినీకాంత్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) రాజకీయాల్లోకి రావాలని చూసి, ఆ తర్వాత ఆరోగ్యం సహకరించక ఆ ఆలోచనని విరమించుకున్న సంగతి తెలిసిందే.
Also Read: విజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు.. వీడియో వైరల్!
ఈ అంశాన్ని అదువ్ అర్జున్ ప్రస్తావిస్తూ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అనుకున్నప్పుడు, DMK పార్టీ నేతలు ఆయన్ని బెదిరించారని, వాళ్లకు భయపడే రజినీకాంత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలన్నీ DMK పార్టీ కి చెందిన రెడ్ జైన్ట్ ఫిలిమ్స్ సంస్థకు సంబంధించినవే అని, రజినీకాంత్ తో DMK పార్టీ నేతలు చీకటి ఒప్పదం చేసుకున్నారంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. రజినీకాంత్ అభిమానులు అయితే విజయ్ ని ట్యాగ్ చేసి ఒక రేంజ్ లో తిడుతున్నారు. తక్షణమే మీ ప్రధాన కార్యదర్శి పై చర్యలు తీసుకుంటూ పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలని, లేని పక్షంలో రజినీకాంత్ ఫ్యాన్స్ పవర్ ఎలాంటిదో చూస్తావని సోషల్ మీడియా లో విజయ్ కి వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు విజయ్ ఫ్యాన్స్ కూడా అందుకు దీటుగా కొంతమంది కౌంటర్లు ఇస్తున్నారు. అయితే అదువ్ అర్జున చేసిన కామెంట్స్ పై రజినీకాంత్ స్పందిస్తూ నేడు ట్విట్టర్ లో వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘అదువ్ అర్జున్ నాపై చేసిన కామెంట్స్ లో ఎలాంటి నిజం లేదు. అతని వ్యాఖ్యలను ఖండిస్తూ నాకు మద్దతుగా నిల్చిన పళని స్వామి , బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ , కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ , మంత్రి రఘుపతి లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారితో పాటు తిరుమావళవన్ , ఎస్పీయే వేలుమణి , మిత్రుడు అన్నాదురై , అర్జున మూర్తి, జీకే వాసన్ , జాన్ పాండియన్ మరియు ఇతర రాజకీయ నాయకులకు ప్రత్యేక కృతఙ్ఞతలు. అదే విధంగా మా సినీ పరిశ్రమకు చెందిన అమీర్ , జీ ధనుంజయ్ వంటి వారు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. వాళ్లకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. కాలం మాట్లాడదు , వేచి ఉండి బదులిస్తుంది ‘ అంటూ చెప్పుకొచ్చాడు రజినీకాంత్.
— Rajinikanth (@rajinikanth) March 17, 2026