spot_img
Homeజాతీయ వార్తలుBengaluru Weather: ఐటీ రాజధాని బెంగళూరులో ఏంటీ మార్పు.. వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతున్నారంటే..

Bengaluru Weather: ఐటీ రాజధాని బెంగళూరులో ఏంటీ మార్పు.. వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతున్నారంటే..

Bengaluru Weather: దేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరులో కొద్దిరోజులుగా పై పరిస్థితి నెలకొంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం.. బంగాళాఖాతంలో వరుసగా తుఫాన్లు ఏర్పడటం వల్ల బెంగళూరు నగరం గజగజ వణికి పోతుంది. బెంగళూరు మాత్రమే కాదు కర్ణాటకలోని అనేక ప్రాంతాలలో ఇదే పరిస్థితి ఉంది. గత కొద్దిరోజులుగా కర్ణాటక వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. మొన్నటిదాకా 22 డిగ్రీలకు మించి పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ప్రస్తుతం అది 16 డిగ్రీలకు పడిపోయింది.. ఇక గత మూడు రోజులుగా ఈ ఉష్ణోగ్రత మరింత దారుణంగా పడిపోయింది.. చల్లని గాలులు వీస్తున్నాయి. వాటి నుంచి తట్టుకోవడానికి.. వెచ్చదనం పొందడానికి ప్రజలు ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు. బయటికి రావడానికి భయపడుతున్నారు. ఉదయం తొమ్మిది దాటిన తర్వాతే తమ పనులు ప్రారంభిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న బెంగుళూరులో వాతావరణం చల్లగా మారడంతో కార్యకలాపాలు కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి. ఐటీ కంపెనీలు తమ పనితీరు సమయాలను మార్చుకున్నాయి. ఉదయం షిఫ్ట్ ఉద్యోగులకు కాస్త సమయం సడలిస్తున్నాయి. చల్లని వాతావరణంలో ప్రయాణం చేసి పనిచేయడం సాధ్యం కావడం లేదని ఉద్యోగులు వాపోవడంతో కంపెనీలు ఆ నిర్ణయం తీసుకున్నాయి.

ఎందుకిలా..

గత కొద్దిరోజులుగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అందువల్లే కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా చల్లని గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరికొద్ది రోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వారు వివరిస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధులు, చిన్నారులు, ఆస్తమావ్యాధితో బాధపడేవారు బయటికి వెళ్ళకూడదని వివరిస్తున్నారు. బెంగళూరులో గురువారం గరిష్టంగా 22.93 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. కనిష్ట ఉష్ణోగ్రత 17.22 డిగ్రీలకు పడిపోయింది. గాలి వేగం గంటకు 44 కిలోమీటర్లు గా ఉంది. సాపేక్ష ఆర్ద్రత 44 శాతంగా ఉంది. సూర్యోదయం ఆరు గంటల 24 నిమిషాలకు నమోదవుతోంది. ఐదు గంటల 50 నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది. ఇక గాలిలో తేమశాతం ఏకంగా 58 వరకు ఉంది. బంగాళాఖాతంలో వరసగా తుఫాను ఏర్పడుతున్న నేపథ్యంలో ఆకాశంలో మేఘాలు ఆవిష్కృతం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు ప్రజలు బయటికి వెళ్లకపోవడం మంచిదని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు..” గాలిలో తేమ అధికంగా ఉంది. చల్లని గాలులు వీస్తున్నాయి. ఇలాంటప్పుడు బయటకు వెళ్లకపోవడమే మంచిది. బయటికి వెళ్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, ఆస్తమా వ్యాధితో బాధపడేవారు సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలి. వెచ్చని దుస్తులు, కళ్ళకు గ్లాసెస్ ధరించాలి. చేతులు, కాళ్లపై చర్మం పగుళ్లు ఇవ్వకుండా లోషన్లు రాసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. చర్మ సంరక్షణ సాధ్యమవుతుందని” వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే ఇటీవల కాలాలతో పోల్చితే.. ఈ ఏడాది చలి అధికంగా ఉందని బెంగళూరు వాసులు వాపోతున్నారు.. ఇటీవల కాలంలో ఈ తరహా చలి గాలులను తాము చూడలేదని వారు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper