Homeజాతీయ వార్తలుTrump Surrenders: భారత్ గెలిచింది.. అమెరికా ఓడింది.. బెండ్ అయిన ట్రంప్

Trump Surrenders: భారత్ గెలిచింది.. అమెరికా ఓడింది.. బెండ్ అయిన ట్రంప్

Trump Surrenders: భారత్, అమెరికా దేశాల మధ్య ఉన్న సంబంధాల విషయంలో కీలక మలుపు జరిగినట్లు తెలుస్తోంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ పన్నులతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల సంఖ్య తగ్గిపోయింది. అయితే ఆ తర్వాత అమెరికాతో స్నేహం చేయడం.. చమురు పై ఒప్పందం చేసుకోవడం పై ట్రంపు పరోక్షంగా భారత్కు హెచ్చరికలు చేశారు. ఆ తర్వాత భారత్ అమెరికాను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అమెరికా ఒక మెట్టు దిగినట్లు తెలుస్తోంది. భారత్ తో న్యాయమైన ఒప్పందం చేసుకుంటామని స్వయానా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడం సంచలన విషయంగా మారింది.

భారత వస్తువులపై 2025 లో ఆగస్టు 1న 25% సుంకాలు పెంచారు. ఆ తర్వాత ఆగస్టు 27 నుంచి 50% అమలులోకి వచ్చింది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం పన్నులు విధించడంతో అమెరికా, భారత్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత భారత్ కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను పెంచింది. అప్పటినుంచి వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది. అయితే అంతకుముందు 2025 జూలైలో ట్రంప్ ఒక ప్రచార సభలో మాట్లాడుతూ.. భారత్ అమెరికా ఉత్పత్తులపై ఎక్కువ సుంకాలు వేస్తుందని అన్నారు. అందుకే మేము కూడా సుంకాలు పెంచుతున్నామని పేర్కొన్నారు. వాస్తవానికి భారత్ కంటే అమెరికాకు ఎక్కువగా వస్తువులు ఎగుమతి అవుతాయి. దీంతో భారత్ పైనే ఈ సుంకాల ప్రభావం ఎక్కువగా పడుతుంది.

ప్రధానంగా భారత్ నుంచి అల్యూమినియం, ఆటో పార్ట్స్, మెడిసిన్, వ్యవసాయ ఆధారిత వస్తువులు ఎగుమతి అవుతూ ఉంటాయి. అయితే ట్రంపు 50 శాతం పన్నులు విధించడంతో ఈ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఎగుమతులు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్ తమరు విషయంలో అమెరికాను కాదని రష్యాతో ఒప్పందం చేసుకున్నారు. సరసమైన ధరకే చమురు సరఫరా చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. దీంతో భారత్, రష్యా మధ్య ఏర్పడిన బంధం పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకపోయాడు. అప్పటినుంచి రకరకాల వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.

అయితే ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. భారత్ మాత్రం రష్యాతో పాటు చైనా తో కూడా మైత్రి బంధం కొనసాగించడం ప్రారంభించడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక అడుగు వెనక్కు వేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే వాణిజ్య ఒప్పందం పై చర్చలు ఉంటాయని ఇటీవల ఆయన స్వయంగా ప్రకటించారు.’మేము భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. ఇది గతంలో చేసుకున్న దాని కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం వారు మమ్మల్ని ఆదరించడం లేదు. ఇకనుంచి వారు మాతో స్నేహం చేసే అవకాశం ఉంటుంది. మేము న్యాయమైన ఒప్పందం చేసుకుంటాం’అని తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version