Homeజాతీయ వార్తలుTrump Surrenders: భారత్ గెలిచింది.. అమెరికా ఓడింది.. బెండ్ అయిన ట్రంప్

Trump Surrenders: భారత్ గెలిచింది.. అమెరికా ఓడింది.. బెండ్ అయిన ట్రంప్

Trump Surrenders: భారత్, అమెరికా దేశాల మధ్య ఉన్న సంబంధాల విషయంలో కీలక మలుపు జరిగినట్లు తెలుస్తోంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ పన్నులతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల సంఖ్య తగ్గిపోయింది. అయితే ఆ తర్వాత అమెరికాతో స్నేహం చేయడం.. చమురు పై ఒప్పందం చేసుకోవడం పై ట్రంపు పరోక్షంగా భారత్కు హెచ్చరికలు చేశారు. ఆ తర్వాత భారత్ అమెరికాను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అమెరికా ఒక మెట్టు దిగినట్లు తెలుస్తోంది. భారత్ తో న్యాయమైన ఒప్పందం చేసుకుంటామని స్వయానా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడం సంచలన విషయంగా మారింది.

భారత వస్తువులపై 2025 లో ఆగస్టు 1న 25% సుంకాలు పెంచారు. ఆ తర్వాత ఆగస్టు 27 నుంచి 50% అమలులోకి వచ్చింది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం పన్నులు విధించడంతో అమెరికా, భారత్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత భారత్ కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను పెంచింది. అప్పటినుంచి వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది. అయితే అంతకుముందు 2025 జూలైలో ట్రంప్ ఒక ప్రచార సభలో మాట్లాడుతూ.. భారత్ అమెరికా ఉత్పత్తులపై ఎక్కువ సుంకాలు వేస్తుందని అన్నారు. అందుకే మేము కూడా సుంకాలు పెంచుతున్నామని పేర్కొన్నారు. వాస్తవానికి భారత్ కంటే అమెరికాకు ఎక్కువగా వస్తువులు ఎగుమతి అవుతాయి. దీంతో భారత్ పైనే ఈ సుంకాల ప్రభావం ఎక్కువగా పడుతుంది.

ప్రధానంగా భారత్ నుంచి అల్యూమినియం, ఆటో పార్ట్స్, మెడిసిన్, వ్యవసాయ ఆధారిత వస్తువులు ఎగుమతి అవుతూ ఉంటాయి. అయితే ట్రంపు 50 శాతం పన్నులు విధించడంతో ఈ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఎగుమతులు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్ తమరు విషయంలో అమెరికాను కాదని రష్యాతో ఒప్పందం చేసుకున్నారు. సరసమైన ధరకే చమురు సరఫరా చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. దీంతో భారత్, రష్యా మధ్య ఏర్పడిన బంధం పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకపోయాడు. అప్పటినుంచి రకరకాల వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.

అయితే ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. భారత్ మాత్రం రష్యాతో పాటు చైనా తో కూడా మైత్రి బంధం కొనసాగించడం ప్రారంభించడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక అడుగు వెనక్కు వేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే వాణిజ్య ఒప్పందం పై చర్చలు ఉంటాయని ఇటీవల ఆయన స్వయంగా ప్రకటించారు.’మేము భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. ఇది గతంలో చేసుకున్న దాని కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం వారు మమ్మల్ని ఆదరించడం లేదు. ఇకనుంచి వారు మాతో స్నేహం చేసే అవకాశం ఉంటుంది. మేము న్యాయమైన ఒప్పందం చేసుకుంటాం’అని తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
Oktelugu Epaper
Exit mobile version