spot_img
Homeఆంధ్రప్రదేశ్‌ap, telangana war : తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త గొడవ.. రైతుల్లో ఆందోళన!

ap, telangana war : తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త గొడవ.. రైతుల్లో ఆందోళన!

ap, telangana war : తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త పంచాయితీ తలెత్తింది. ఏపీ నుంచి వస్తున్న ధాన్యాన్ని ఉన్నఫళంగా అడ్డుకుంది తెలంగాణ. వడ్ల లోడుతో వస్తున్న వాహనాలను రాష్ట్ర సరిహద్దుల్లోనే ఆపేస్తున్నారు తెలంగాణ పోలీసులు! దీంతో.. ఊహించని పరిణామంతో ఏపీ రైతులు తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురవుతున్నారు. అన్ని అనుమతులూ ఉన్నప్పటికీ.. తమను అడ్డుకున్నారని, ఇది సరికాదని ఆంధ్ర రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

AP CM Jagan, TS CM KCR

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద.. ఏపీ నుంచి వస్తున్న వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. గురువారం అర్ధరాత్రినుంచే ఈ చర్యకు దిగారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని ఆపేస్తున్నారు. ఫలితంగా.. ధాన్యంతో వచ్చిన లారీలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

కొన్ని రోజులుగా తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల రగడ సాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ధా\న్యం కొనుగోలు చేయట్లేదని తెలంగాణ సర్కారు వాదిస్తోంది. దీన్ని బీజేపీ కౌంటర్ చేస్తోంది. టీఆర్ఎస్ సర్కారు కొనుగోలు చేయకుండా కేంద్రాన్ని నిందిస్తోందని కమలనాథులు అంటున్నారు. ఈ వివాదం రోజులతరబడి సాగుతోంది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ.. తెలంగాణ సర్కారు ధర్నాకు సైతం దిగింది. అంతేకాదు.. వరి సాగు చేయొద్దని కూడా రైతులకు సూచించింది తెలంగాణ సర్కారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇక్కడి రైతుల ధాన్యం కొనుగోలు అంశమే డైలమాలో పడింది. అందుకే.. ఏపీ నుంచి వస్తున్న ధాన్యాన్ని అడ్డుకున్నట్టు సమాచారం.

అయితే.. ఏపీ రైతులు మాత్రం తీవ్ర అవేదనకు గురవుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాలతో పరిస్థితి దారుణంగా ఉందని, ధాన్యాన్ని తిరిగి తీసుకెళ్లి, నిల్వ చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ ఈ విషయంపై స్పందించి.. తగిన పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే విషయంపై ఈరోజు స్పష్టత రానుంది. ఇవాళ కేంద్ర మంత్రితో.. తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో కేంద్రం ఎంత మేర ధాన్యం కొనుగోలు చేయనుంది అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య మరో పంచాయితీ మొదలైంది. ఇప్పటికే కొనసాగుతున్న నీటి వివాదం.. ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఆ మధ్య కరోనా పేషెంట్లను అనుమతించే విషయంలోనూ వివాదం చెలరేగింది. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల గొడవ. మరి, ఈ సమస్యపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాంటి వైఖరి అవలంభించనున్నారు? కేంద్ర ఏమైనా జోక్యం చేసుకుంటుందా? ధాన్యాన్ని తెలంగాణలోకి అనుమతిస్తారా? లేదా? అన్నది చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Oktelugu Epaper