spot_img
Homeజాతీయ వార్తలుTelangana Elections: తెలంగాణ ఎన్నికలు: ఆ 3 కోట్లు గుజరాత్ నుంచి వచ్చాయా? బీజేపీ...

Telangana Elections: తెలంగాణ ఎన్నికలు: ఆ 3 కోట్లు గుజరాత్ నుంచి వచ్చాయా? బీజేపీ వా?

Telangana Elections: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన క్రమంలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో బంగారు నగలు, వెండి ఆభరణాలు కూడా లభ్యమవుతున్నాయి. ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి నేటి వరకు భారీగా నగదు, బంగారం, వెండి లభ్యమవుతూనే ఉన్నాయి. పోలీసులు చెక్ పోస్ట్ లు ఏర్పాటుచేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ డబ్బు అక్రమ రవాణా ఆగడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో భారీగా నగదు పట్టుబడుతుండడం పోలీసులను కూడా ఆశ్చర్యపరుస్తున్నది. మియా పూర్ ప్రాంతంలో సోమవారం ఒక్కరోజే కోట్ల విలువైన బంగారం, వెండి, లక్షల విలువైన నగదు లభ్యమవడం విశేషం. అయితే తాజాగా నల్లగొండ జిల్లాలో ఒక్క కారులో తరలిస్తున్న 3.04 కోట్ల నగదు పట్టుబడటం పోలీసులను నివ్వెరపరిచింది. అయితే ఈ నగదుకు సంబంధించిన వివరాలు, వాటిని తరలిస్తున్న వ్యక్తుల నేపథ్యం గుజరాత్ రాష్ట్రం కావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.

నల్లగొండ జిల్లాలో ఆదివారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో టోల్ గేట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వాహనం అతివేగంగా మిర్యాలగూడ వైపు దూసుకెళ్లింది. అయితే ఆ కారును నిలువరించేందుకు పోలీసులు ఈదలగూడ జంక్షన్ వద్ద ప్రయత్నించారు. అయితే వారు చేసిన ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలో పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించారు. వాడపల్లి అంతర్రాష్ట్ర సమీకృత తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు ఆ కారును పట్టుకున్నారు. అందులో తనిఖీలు నిర్వహించగా.. కారు ముందు భాగంలో సీటు కింద గుట్టుగా దాచిన 3.4 కోట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ స్వాధీనం చేసుకున్న నగదు గుజరాత్ రాష్ట్రానికి చెందిన విపుల్ కుమార్, అమర్ సిన్హాజా కు చెందినదని పోలీసులు గుర్తించారు. ఆ కారులో వారు ప్రయాణిస్తుండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ నగదు గుజరాత్ రాష్ట్రం నుంచి రావడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. గుజరాత్ రాష్ట్రం నుంచి రావడంతో ఈ నగదు ఆ ప్రధాన పార్టీకి చెందినదిగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నగదు తరలిస్తున్న వ్యక్తులు కూడా ఓ పార్టీలో క్రియాశీలకంగా కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. అయితే వారు ఈ నగదును ఇక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎవరికి అందజేసేందుకు వారు వెళ్తున్నారు? వారి ఫోన్ రికార్డులు, వాట్సాప్ చాట్ ను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. చాట్ హిస్టరీని రిట్రైవ్ చేసేందుకు ఫోరెన్సిక్ అధికారులకు పంపారు. ఐటీ అధికారులకు నగదు అందజేసిన పోలీసులు.. నిందితుల నుంచి ఇప్పటికే వాంగ్మూలాలు సేకరించారు. అయితే ఈ నగదు వ్యవహారంలో పెద్ద పెద్ద వ్యక్తులే ఉన్నారని తెలుస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Oktelugu Epaper
Exit mobile version