
ఉస్మానియా యూనివర్సిటీలో కరోనా కల్లోలం రేపుతోంది. 12మంది మెడికల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడంతో కలకలం మొదలైంది. తొలుత ఓ పీజీ విద్యార్థికి కరోనా సోకడంతో అతడికి సన్నిహితంగా ఉన్నవారికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇందులో 12మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తమై తగు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే యూనివర్సిటీలోని రీడింగ్ రూమ్ మూసివేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తరగతి గదులు, ప్రయోగ శాలలను పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు.
ఉస్మానియా మెడికల్ యూనివర్సిటీలో మొత్తం 296మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా హాస్టల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 180 మంది అమ్మాయిలు, 116మంది అబ్బాయిలు ఉన్నారు. కరోనా కల్లోలం నేపథ్యంతో వీరిందరికీ టెస్టులు నిర్వహించారు. వీరి రిపోర్టులు బుధవారం నాటికి వచ్చే అవకాశం ఉందని యూనివర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు వైరస్ బారిన పడటంతో ఈనెల 20నుంచి నిర్వహించే పీజీ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థుల డిమాండ్ చేస్తున్నారు. అయితే పరీక్షల నిర్వహాణపై యూనివర్సిటీ అధికారుల నిర్వహాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కరోనా నిర్ధారణ రిపోర్టు వచ్చాకే పీజీ పరీక్షల నిర్వహాణపై అధికారులు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.