spot_img
Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: జగన్ యాక్షన్.. అధికారుల ఓవర్ యాక్షన్

CM Jagan: జగన్ యాక్షన్.. అధికారుల ఓవర్ యాక్షన్

CM Jagan: పక్షం రోజుల క్రితం కురిసిన వర్షాలకు రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు, కడప, నెల్లూరు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ప్రాణనష్టం, ఆస్తినష్టం భారీగానే చోటుచేసుకోగా.. వేలాది మంది వారికి ఉన్న నీడను కోల్పోయారు. దిక్కులేని వాళ్లలా రోడ్డున పడ్డారు. పంటపొలాలు నీటమునగగా.. గొడ్డూ, గోద వరదలో కొట్టుకుపోయాయి. వారం రోజులకు పరిస్థితి కాస్త చక్కపడగా.. మధ్యలో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి వరద పరిస్థితిపై, అక్కడ ఇబ్బందులు పడుతున్న వారిని గురించి పట్టించుకోలేదన్న ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. ఈ క్రమంలో రెండు, మూడు రోజులపాటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలోని కడప, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
CM Jagan
ఇంతవరకు బాగానే ఉన్నా.. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా స్థానిక అధికారులు ఓవర్ యాక్షన్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన ఉందని ముందుగానే తెలుసుకుని ఏఏ ప్రాంతాల్లో పర్యటిస్తారో.. ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేశారని సమాచారం. అంటే.. జగన్ ఎక్కడెక్కడ తిరగాలి.. ఎవరితో మాట్లాడాలి.. సీఎం జగన్ తో ఎవరెవరు మాట్లాడాలి..? సమస్యలు ఎవరు చెప్పాలి.. జేజేలు ఎవరు కొట్టాలి అనే అంశం మొత్తం అధికారులు ముందుగానే రెడీ చేసుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలో జగన్ పర్యటించిన పలు ప్రాంతాల్లో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. వరద ప్రాంతాల్లో సీఎం పర్యటించే సమయంలో జగన్ దగ్గరికి ఎవరు ఎవరు రావాలి..? జగన్ తో ఎవరు మాట్లాడాలి.. ఏఏ సమస్యలపై మాత్రమే చర్చించాలనే అంశాన్ని ముందుగానే చెప్పి ఉంటారు. ఇదే క్రమంలో జగన్ పర్యటించే ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజల వద్దకు ముందుగానే గ్రామ వలంటీర్లను పంపించి.. ముందస్తు ప్రిపరేషన్ చేశారని చెప్పుకుంటున్నారు.

Also Read: Rosaiah Death: చిరంజీవిని రాజకీయాల్లోకి తెచ్చి.. వైఎస్ఆర్, చంద్రబాబులకు కుడిభుజంగా మారి.. రోశయ్య ప్రస్థానం

అంటే.. ఒక ప్రతిపక్ష నేతగా మూడువేలకు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ సమయంలో.. ప్రజలతో కలిసిపోయారు. ప్రతీఒక్కరి ఇంటికి వెళ్లారు. అక్కున చేర్చుకున్నారు. సమస్యలు ఓపిగ్గా విన్నారు. పరిష్కారానికి మార్గం చూపుతామని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉన్న ఉన్న సమయంలో ఉన్న కలుపుగోలు తనం ఇప్పుడు ఎందుకు లేదని కొందరు అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి ప్రొటోకాల్ ప్రకారం.. నిక్కచ్చిగానే వ్యవహరించాలి.. అయితే.. మరీ సెలెక్టెడ్ వ్యక్తులతోనే మాట్లాడడం.. అందుకు సంబంధించిన స్క్టిప్టు కూడా అధికారులే ప్రజలకు ముందుగా ఇవ్వడం ద్వారా ప్రజల్లో జగన్ ఉండే మైలేజీ దెబ్బతింటుందని కొందరు అంటున్నారు. భవిష్యత్ లో ఇది ప్రమాదకరమని.. రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Also Read: Konijeti Rosaiah: మాజీ సీఎం రోశయ్య ఇకలేరు.. ఆయన ప్రస్థానం..!

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version