Homeఆంధ్రప్రదేశ్‌చంద్రబాబు, వెలగపూడి.. ఓ అపశకునం..

చంద్రబాబు, వెలగపూడి.. ఓ అపశకునం..

ఇంతటి కరోనా వైరస్ టైంలో ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తన సొంత రాష్ట్రంలో ఉండకుండా తెలంగాణలోని తన సొంతింట్లో ఉండిపోయారు. ఏపీలో కరోనా వైరస్ విస్తరిస్తున్నా.. మరణాలు సంభవిస్తున్నా.. విశాఖలో గ్యాస్ లీక్ అయినా రాకపోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

చంద్రబాబు గత ప్రభుత్వంలో ఏరికోరి కట్టించుకున్న వెలగపూడిలోని సచివాలయమే ఆయన కొంప ముంచిందన్న టాక్ వినిపిస్తోంది. తన పదవి ఊడిపోవడానికి.. తనకు ఈ దుస్థితి పట్టడానికి.. ఉపద్రవాలకు ఆ వెలగపూడి సచివాలయమే కారణమని చంద్రబాబు భావిస్తున్నాడట.. అందుకే ఈ కరోనాటైంలో ఏపీలో ఉండలేక చంద్రబాబు హైదరాబాద్ మకాం మార్చాడని టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటా ‘వెలగపూడి’ సెంటిమెంట్ అన్నది ఆరాతీస్తే ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి.

చంద్రబాబు గత ప్రభుత్వంలో ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు ఏరికోరి మరీ వాస్తు పట్టించుకోకుండా వెలగపూడిలో సచివాలయం కట్టించాడు.అక్కడి నుంచే పాలించాడు. అది చిన్న వర్షానికే నీళ్లు చీరి.. లీక్ అయ్యి ఎంత రాద్ధాంతం అయ్యిందో అందరికీ తెలిసిందే.. కానీ అప్పుడు జరిగిన వరసు ఉపద్రవాలు ఆ సచివాలయం వల్లేనని టీడీపీ వర్గాల్లో చర్చ మొదలైంది. చంద్రబాబుతో వెలగపూడి సచివాలంలో మీటింగ్ అయిన వారందరికీ ఏదో ఒక అపశకునం ఎదురైంది నాడు. ఆ తర్వాత బాబుతో మీటింగ్ అపశకునమా..? అన్న చర్చ మొదలైంది. వెలగపూడిలో ఆయన్ను కలిశాకే కొందరి ప్రాణాలు పోయాయి.. మరికొందరు పదవులు ఊడిపోయాయన్న ప్రత్యర్థుల నిజమేనా? అసలు వెలగపూడి సచివాలయం సాక్షిగా ఏం జరిగిందనేది చర్చించుకుంటున్నారు.

అప్పట్లో సినీ నటి, కం రాజకీయ నాయకురాలు జయసుధ భర్త హఠాన్మరణం చెందారు.. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనతో ఆయన చనిపోయారని వార్తలు వెలువడ్డాయి. కానీ అంతకుముందే జయసుధ భర్త వెలగపూడిలో చంద్రబాబును యాదృశ్చికంగా కలవడం గమనార్హం. అలా కలిసిన తర్వాతే జయసుధ భర్త నితిన్ కపూర్ ముంబైలో ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త నాడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇక అంతకుముందు కూడా ఇలానే నంద్యాల ఎమ్మెల్యే సీనియర్ నేత భూమా నాగిరెడ్డి కూడా చంద్రబాబును వెలగపూడిలో కలిసిన తర్వాతే గుండెపోటుతో మరణించడం యథాలాపమా..? లేక యాదృశ్చికంగా జరిగిందో కానీ.. వెలగపూడి సచివాలయానికి మాత్రం ఆ మరక అంటింది. .

ఇక తర్వాత తమిళనాడు సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం కూడా చంద్రబాబును వెలగపూడిలో కలిశాక అమ్మ జయలలిత చనిపోవడం.. పన్నీర్ సెల్వం పదవి ఊడిపోవడం జరిగింది… దీంతో పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు బాబును వెలగపూడిలో కలిస్తే ఏదో ఉపద్రవం జరుగుతుందన్న ప్రచారం విస్తృతంగా సాగింది. ఇలా ముగ్గురు కలిశారు.. ముగ్గురికి ఏదో జరిగిందని ఊదరగొడుతున్నారు..

ఇక వెలగపూడి నుంచే పాలించిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాడు.. వాస్తు ప్రకారం ఇక్కడ ఉండడం వల్లే ఇన్ని అనర్థాలు, ఓటములు ఎదురయ్యాయని ఓ ప్రముఖ పండితుడు చెప్పాడట.. అందుకే బాబు ఇప్పుడు అవన్నీ తలుచుకొని హైదరాబాద్ లోనే ఉండిపోతున్నాడని టీడీపీలో ప్రచారం సాగుతోంది.

ఈ ప్రచారం ఎలా ఉన్నా కానీ చంద్రబాబును వాళ్లు కలవడం.. వారికి అపశకునం జరగడం మాత్రం వాస్తవం. కానీ అది బాబు వల్ల కలిగిందా.? లేదా వారి స్వయంకృతాపరాధమా అన్నది విధి వైపరీత్యం.. పాపం ఈ మొత్తం ఎపిసోడ్ లో బాబు మాత్రం బుక్కైపోవడం గమనార్హం.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular