Homeఆంధ్రప్రదేశ్‌Somu Veerraju: సోమువీర్రాజు ‘అగ్రిగోల్డ్ ప్లాన్’

Somu Veerraju: సోమువీర్రాజు ‘అగ్రిగోల్డ్ ప్లాన్’

Somu Veerraju
Somu Veerraju, Jagan

Somu Veerraju: గత ఎన్నికల్లో వైసీపీ అంతులేని విజయానికి చాలా కారణాలున్నాయి. అన్నివర్గాలను టార్గెట్ చేస్తూ మేనిఫెస్టో రూపొందించడం ఒక కారణమైతే.. ఒక చాన్స్ అన్న నినాదం జగన్ కు కలిసొచ్చింది. 2014 ఎన్నికల్లో పెద్దగా హామీల జోలికి వెళ్లకున్నా.. 2019లో మాత్రం నవరత్నాలతో పాటు చాలారకాలుగా హామీలిచ్చారు. ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన జగన్ దారిపొడవునా ప్రజలు అడిగిందే తడవుగా హామీలిచ్చారు. కానీ ఇప్పుడు ఏ ఒక్కటీ అమలవుతున్న దాఖలాలు లేవు. నవరత్నాల్లో పథకాలు తప్పించి మరే ఇతర సంక్షేమమూ లేదు. అటునవరత్నాల్లో మద్యనిషేధం వంటి వాటిని తూట్లు పొడిచారు. అయితే మేజర్ బాధిత వర్గం ఒకటుంది. అదే అగ్రిగోల్డ్ ఖాతాదారులు. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ నష్టాన్ని షటిల్ చేస్తానని హామీ ఇచ్చిన జగన్ కు .. నాలుగేళ్లవుతున్నా ఆ విషయం గుర్తులేదన్నట్టుంది. అందుకే పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఇప్పుడు అగ్రిగోల్డ్ అంశాన్ని బీజేపీ తన నెత్తిన ఎత్తుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి బాధితులకు న్యాయంచేయాలని నిర్ణయించుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అగ్రిగోల్డ్ అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఇంతవరకు ఎంతమంది సమస్యలు పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం జగన్.. ఆ హామీ ఇచ్చి మూడున్నర ఏళ్లు దాటినా ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. దీంతో ఏపీలో అగ్రిగోల్డ్ ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. గత ఎన్నికల్లో బాధితులకు హామీ ఇచ్చి లబ్ధి పొందిన జగన్ ఇప్పుడు న్యాయం చేయడం అనివార్యంగా మారింది. అదే జరిగితే బీజేపీకి పొలిటికల్ అడ్వాంటేజ్.

Somu Veerraju
Somu Veerraju

రాష్ట్రంలో లక్షలాది మంది అగ్రిగోల్డ్ ఖాతాదారులు ఉన్నారు. వారంతా యాజమాన్యం చేతిలో దారుణ వంచనకు గురయ్యారు. అటు పాలసీలను ఆకర్షించిన ఏజెంట్లు పదుల సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారదరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన వారితో జగన్ ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు నిట్ట నిలువునా ముంచారు. టీడీపీ హయాంలో ఆస్తులన్నీ జప్తు చేయించి వేలం వేయించే ప్రక్రియ చేపట్టారు. కానీ ఆస్తులన్నీ టీడీపీ నేతలు కొట్టేస్తున్నారని వేలాన్ని ఆపేయించారు. జీ సంస్థ ముందుకు వస్తే ఆరోపణలు చేయించి ఆ కంపెనీ వెనక్కి వెళ్లేలా చేశారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి బడ్జెట్‌లో పదిహేను వందల కోట్లు కేటాయించి అందరికీ న్యాయం చేస్తానన్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించారు కానీ.. రూపాయి విడుదల చేయలేదు. టీడీపీ ప్రభుత్వం ఆస్తులు వేలం వేసి ఉంచిన డబ్బులను ఏడాదిన్నర తర్వాత రూ. 250 కోట్లు జమ చేశారు. ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు.

అయితే ఇప్పుడు అగ్రిగోల్డ్ అంశాన్ని బీజేపీ నెత్తినెత్తుకోవడం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీపై ఆరోపణలున్న నేపథ్యంలో ఆ పార్టీ ఆశించిన స్థాయిలో పోరాటం చేయలేకపోతోంది. వామపక్షాలు సైతం సైలెంట్ గా ఉన్నాయి. ఈ తరుణంలో సోము వీర్రాజు వ్యూహాత్మకంగా అగ్రిగోల్డ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. గట్టి పోరాటానికి వ్యూహం రూపొందిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉద్యమానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదికానీ వర్కవుట్ అయితే అగ్రిగోల్డ్ బాధితులు బీజేపీ గూటికి చేరే అవకాశముందని.. ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ గా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
rain forecast for AP

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper