Homeఆంధ్రప్రదేశ్‌పవన్‌ను కలిసిన రెడ్డయ్య యాదవ్‌.. షాక్‌లో వైసీపీ శ్రేణులు

పవన్‌ను కలిసిన రెడ్డయ్య యాదవ్‌.. షాక్‌లో వైసీపీ శ్రేణులు

KP Reddaiah Yadav, Pawan Kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివర్ తుపాన్ బాధిత రైతుల్ని పరామర్శించేందుకు జిల్లాల పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. రైతులను కలుస్తూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇందులో వైసీపీ శ్రేణులు షాక్‌ అయ్యేంత మ్యాటర్‌‌ ఏముందని ఆలోచిస్తున్నారా..? పామర్రు వద్ద పవన్‌ను మాజీ ఎంపీ కె.పి.రెడ్డయ్య యాదవ్ కలిశారు. ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడం లేదని, తుఫాన్‌ పరిహారం పరిహారం తదితర విషయాలను ఆయనకు వివరించారు. పవన్ కూడా.. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి సలహాలు తీసుకుందామని మాటిచ్చారు. ఇదంతా మామూలేగా జరిగేదే కదా అంటరా..? అక్కడికే వస్తున్న..

Also Read: జగన్ కు బీజేపీ భారీ షాక్.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి ఫిర్యాదు

రెడ్డయ్య యాదవ్‌ వైసీపీ ఎమ్మెల్యే తండ్రి

మాజీ ఎంపీ రెడ్డయ్య యాదవ్ ఎవరో కాదు.. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పార్థసారధికి తండ్రి. రెడ్డయ్య వారసుడిగానే పార్థసారధి రాజకీయాల్లోకి వచ్చారు. ఇన్నాళ్లు పెద్దగా యాక్టివ్ గా లేని రెడ్డయ్య కొడుకు ఉన్న పార్టీ ప్రత్యర్థిని కలవడం చర్చనీయాంశం అయ్యింది. ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు. దీంతో వైసీపీ క్యాడర్‌‌ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. జనసేన సైనికులు మాత్రం అప్పుడు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు.

పార్థసారధికి మంత్రి పదవి దక్కలేదనా.. ?

వైఎస్ హయాంలో మంత్రిగా చేసిన పార్థసారధికి జగన్ మొదటి కేబినెట్‌లో చోటు దక్కలేదు. ఇటీవల ఇద్దరు బీసీ మంత్రులతో రాజీనామాలు చేయించిన్పుడు అవకాశం వస్తుందనుకున్నారు. కానీ మళ్లీ నిరాశే ఎదురైంది. తన సీనియార్టీని గుర్తించడం లేదని పార్థసారధి వైసీపీపై అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగున్న నేపథ్యంలో.. ఆయన తండ్రి పవన్‌ను కలవడం మరింత ఆజ్యం పోసినట్లైంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

Exit mobile version