Homeజాతీయ వార్తలుState Bank of India : ఎస్.బి.ఐ ఎండిగా చీరాల వాసి.. తొలిసారిగా ఇద్దరు తెలుగు...

State Bank of India : ఎస్.బి.ఐ ఎండిగా చీరాల వాసి.. తొలిసారిగా ఇద్దరు తెలుగు వ్యక్తులకు బ్యాంకు పగ్గాలు!

State Bank of India : ఇండియన్ బ్యాంకింగ్ రంగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది ప్రత్యేక స్థానం. దేశీయ బ్యాంకింగ్ రంగంలో కూడా అగ్రస్థానంలో నిలుస్తోంది ఈ శాఖ. అటువంటి ఎస్బిఐ చరిత్రలో తొలిసారి ఇద్దరు తెలుగు వ్యక్తులు మంచి పదవుల్లో నియమితులు కావడం గమనార్హం. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల మంత్రివర్గ సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్బిఐ మేనేజింగ్ డైరెక్టర్ గా తెలుగువాడైన అమర రామ్మోహనరావు నియమితులయ్యారు. వచ్చే మూడేళ్ల కాలానికి ఆయన ఎస్బిఐ ఎండిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎస్బిఐ చైర్మన్ గా ఇటీవలే తెలుగు వ్యక్తి శ్రీనివాసులు శెట్టి నియమితులైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎండిగా ఆంధ్రప్రదేశ్ లోని చీరాలకు చెందిన రామ్మోహన్ రావు నియామకం అయ్యారు. ప్రభుత్వ బ్యాంకులు, కంపెనీలకు సారధులను అన్వేషించే ది ఫైనాన్స్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో ఈ ఏడాది సెప్టెంబర్ లోనే స్టేట్ బ్యాంక్ ఎండి పదవికి రామ్మోహన్ రావు పేరును సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన ఎస్బిఐ డిప్యూటీ ఎండిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంతకుముందు ఎస్.బి.ఐ ఎండి గా ఉన్న శ్రీనివాసులు శెట్టి బ్యాంక్ చైర్మన్ గా నియామకమైన క్రమంలో ఆ పోస్ట్ ఖాళీ అయింది. ఇప్పుడు అదే ఎండి పోస్టులో రామ్మోహన్ రావు బాధ్యతలు చేపట్టడం ఖాయంగా తేలింది.

* నాలుగో ఎండిగా బాధ్యతలు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డులో చైర్మన్ తో సహా నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లు ఉంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇప్పుడు రామ్మోహన్ రావు నాలుగో ఎండిగా నియమితులయ్యారు. ఏపీలోని చీరాలకు చెందిన రామ్మోహన్ రావు ఇంజనీరింగ్ పట్టా పొందారు. 1991లో విశాఖలో ప్రొబేషనరీ ఆఫీసర్గా విధుల్లో చేరారు. ప్రస్తుతం బ్యాంకు డిప్యూటీ ఎండిగా పనిచేస్తున్న ఆయన 33 సంవత్సరాలుగా ఎస్బిఐలో వివిధ విభాగాల్లో పని చేశారు. గత ఏడాది ఆగస్టు వరకు ఎస్బిఐ అనుబంధ సంస్థ ఎస్బిఐ కార్డ్స్ ఎండి, సీఈఓ గా సేవలందించారు. దానికి ముందు ఎస్బిఐ గోపాల్ సర్కిల్ సిజిఎం గాను సేవలందించారు.

* చైర్మన్ గా శ్రీనివాసుల శెట్టి
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇద్దరు తెలుగువాళ్లు ఉన్నత సేవలు అందించడం విశేషం. ఇప్పటికే బ్యాంకు చైర్మన్ గా శ్రీనివాసుల శెట్టి ఉన్నారు. ఇప్పటివరకు ఎండిగా ఉన్న ఆయన.. చైర్మన్ గా పదోన్నతి పొందారు. ఎండిగా రామ్మోహన్ రావు ప్రమోట్ అయ్యారు. అంటే ఎస్బిఐ ఇద్దరు తెలుగువారి చేతుల్లో ఉందన్నమాట. మొత్తానికైతే జాతీయస్థాయిలో తెలుగు వారికి ఇది అరుదైన గౌరవంగా చెప్పవచ్చు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version