Homeఆంధ్రప్రదేశ్‌Digital Payments: అప్పుడు 13 లక్షల కోట్లు.. ఇప్పుడు 41 లక్షలు కోట్లు.. మరి వాటి...

Digital Payments: అప్పుడు 13 లక్షల కోట్లు.. ఇప్పుడు 41 లక్షలు కోట్లు.. మరి వాటి సంగతేంటి..

Digital Payments: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. అయితే చాలామంది ఆర్థికవేత్తలు డిజిటల్ చెల్లింపుల వల్ల నగదు లావాదేవీలు చాలా వరకు తగ్గిపోయాయని.. మామూలు టీ షాప్ నుంచి కార్పొరేట్ హోటల్ వరకు అన్నింట్లోనూ డిజిటల్ విధానంలో చెల్లింపులు జరుగుతున్నాయని చెబుతున్నారు. కానీ డిజిటల్ యుగంలో కూడా పాత పరిస్థితే ఉంది. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇదే విధంగా ఉంది.

ఇప్పటి కాలంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. అలాగని నగదు చెల్లింపులు తగ్గుముఖం పట్టలేదు. దేశంలో చలామణి అవుతున్న నగదు లెక్కలు ఇదే విషయాన్ని తేడా తెలియచేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం 10 సంవత్సరాల కాలంలో ఇది మూడు రెట్లు పెరిగింది. 2017 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా నగదు చలామణి 13 లక్షల కోట్లు ఉండేది.. 2026 ఆర్థిక సంవత్సరానికి అదేకంగా 41 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో ఏటీఎం నెట్వర్క్ మాత్రం దారుణంగా పడిపోయింది. 2023లో 2.19 లక్షలకు పైగా ఏటీఎం యంత్రాలు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 2.09 లక్షలకు పడిపోయింది. నగదు ఉపసంహరణలు కూడా 32.6 లక్షల కోట్ల నుంచి 28.6 లక్షల కోట్లకు పడిపోయాయి.

ఏటీఎంల సంఖ్య పడిపోవడంతో నగదును ఉపసంహరించుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకుల నుంచి ఏటీఎంలోకి వచ్చే నగదు పడిపోయిందని తెలుస్తోంది.. మార్చి, ఏప్రిల్ నెలల్లో.. మన దేశ వ్యాప్తంగా ఏటీఎంలో స్టోర్ చేసేందుకు 94 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. మార్చి నెలలో 61 వేల కోట్లు.. ఏప్రిల్ నెలలో 54 వేల కోట్లు మాత్రమే సమకూర్చారు. ఇక కేంద్రీకృత బ్యాంకు నివేదిక ప్రకారం గడిచిన నెల 22 నాటికి దేశంలో మొత్తం 42.54 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉందని తెలుస్తోంది. ఇక ఏటీఎం లావాదేవీలు గత ఏడాదితో పోల్చి చూస్తే 10.4% తగ్గింది.

ప్రజలు డిజిటల్ చెల్లింపుల వైపు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం విచిత్రంగా ఉంది. డిజిటల్ తో పాటు నగదు లావాదేవీలు కూడా ప్రజలు నిర్వహిస్తున్నారు. అందువల్ల క్యాష్ స్పెక్యులేషన్ కూడా విపరీతంగా ఉంది. అయితే వచ్చే రోజుల్లో ఇది తగ్గే అవకాశం ఉంటుందా.. పెరుగుతుందా.. అనే విషయాలను ఇప్పుడే చెప్పలేమని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version