ఆంధ్రప్రదేశ్‌AP Politics: ఏపీలో రాజకీయ వైకుంఠపాళి

AP Politics: ఏపీలో రాజకీయ వైకుంఠపాళి

AP Politics: రాజకీయాలు అంటే పరమపద సోపానం. అసలు సిసలైన వైకుంఠపాళి. గమ్యస్థానానికి త్వరితగతిన చేర్చే నిచ్చెనలు ఉంటాయి.పాతాళానికి చేర్చేపాములు సైతం సిద్ధంగా ఉంటాయి. అందుకే ఆచీతూచీ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాలు అసలు సిసలైన వైకుంఠపాళి ని తలపిస్తున్నాయి. కొందరు నిచ్చెన ఎక్కి పాము ముంగిట నిలిచారు. మరికొందరు పాము నోట్లో పడి.. తిరిగి నిచ్చెన ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పాత కేసులను సైతం ఎదుర్కొంటున్నారు. రాజకీయ వైకుంఠపాళీ లో దాదాపు విజయానికి అవసరమైన అన్ని మెట్లు ఎక్కారు. కూత వేటు దూరంలో పాము ముందు నిలబడ్డారు. సరిగ్గా ఫలితం దక్కే సమయానికి పాము నోట్లో పడి కిందకు దిగిపోయారు. ఇప్పుడు పైకి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. దానికి జనసేన ను దన్నుగా తీసుకున్నారు. ఒక్క అవకాశంతో యధా స్థానానికి చేరుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఏమాత్రం అజాగ్రత్తగా అడుగులు వేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఇక పవన్ సైతం నిచ్చెన పట్టుకొని కోరుకున్న స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆర్థిక, అంగ బలం లేకుండా వైకుంఠపాళి ఆడుతున్న పవన్ కు తెలుగుదేశం పార్టీ అనుకోని సాయాన్ని అందించింది. వారి సాయంతోనే నిచ్చెనలు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. క్రమేపీ అడుగులు వేస్తున్నారు. తన బలానికి.. టిడిపి సాయం తోడైతే అనుకున్న స్థానానికి చేరుకోవచ్చు అని భావిస్తున్నారు. అయితే ఏమాత్రం అజాగ్రత్తగా అడుగులు వేసినా సాయం చేసే చెయ్యి పక్కకు తప్పుకునే అవకాశం ఉంది. అదే జరిగితే పాము నోట్లో పడి కిందకు పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే టిడిపి అందించే సాయాన్ని మరింత బలోపేతం చేసుకొని.. అనుకున్న లక్ష్యానికి చేరువ కావాలని పవన్ ప్రయత్నిస్తున్నారు.

అయితే ఈపాటికే నిచ్చెనలు ఎక్కి చివరి స్థానంలో జగన్ ఉన్నారు. దాన్ని స్థిరంగా కొనసాగించాలంటే ఆయన సైతం అడుగులు సక్రమంగా వేయాలి. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా పాము నోట్లో పడి కింద పడడం ఖాయం. ఇప్పటికే తన ఎత్తులు చిత్తులతో చంద్రబాబును పాము నోట్లో పడేలా పావులు కలిపారు. నిచ్చెనలు ఎక్కకుండా ఎక్కడికక్కడే అడ్డుపడుతున్నారు. నిచ్చెనలు అందకుండా చేస్తున్నారు. ఇలా ఏపీలో వైకుంఠపాళి నడుస్తోంది. ఎవరికి వారు పాములకు దొరకకుండా.. నిచ్చెనలు ఎక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే విజయం అంత సులువుగా దక్కే అవకాశాలు ఏ ఒక్కరికీ లేవు. చివరి వరకు జాగ్రత్తతో, ప్రజాభిష్టానికి తగ్గట్టు వైకుంఠపాళి ఆడితేనే విజయం దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Exit mobile version