దేశం కోసం రూ.20లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ!

కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల వల్ల నష్టపోయిన వారికి, ఉపాధి కోల్పోయిన వారికి చేయూతనందించేందుకు ప్రధాని మోడీ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పేరిట రూ.20లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇది మన దేశ జీడీపీలో 10 శాతమని తెలిపారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా చేయూతనిస్తూ.. ప్రతి శ్రామికుడు, రైతు జేబులోకి నేరుగా వెళ్తుంది. ఈ […]

Written By: Neelambaram, Updated On : May 13, 2020 7:28 am
Follow us on

కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల వల్ల నష్టపోయిన వారికి, ఉపాధి కోల్పోయిన వారికి చేయూతనందించేందుకు ప్రధాని మోడీ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పేరిట రూ.20లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇది మన దేశ జీడీపీలో 10 శాతమని తెలిపారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా చేయూతనిస్తూ.. ప్రతి శ్రామికుడు, రైతు జేబులోకి నేరుగా వెళ్తుంది. ఈ ప్యాకేజీ రూపకల్పన, నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదం చేస్తుంది. ఆర్థిక ప్యాకేజీపై కరోనా పోరాటంలో ప్రతిఒక్కరికీ చేయూతనిస్తుంది. భారత పారిశ్రామిక రంగానికి మరింత బలాన్ని చేకూర్చేందుకు ప్యాకేజీ ఉపయోగకరంగా ఉంటుందని ప్రధాని తెలిపారు.