Woman loses limbs after dog lick: ఒకప్పుడు ఇళ్లలో ఆవులు, గేదెలు, మేకలు పెంచుకునేవారు. వీటితో వ్యవసాయ పనులు కూడా జరిగేవి. ఇక వీధి కుక్కలకు రోజూ ఇంత ముద్ద వేస్తే ఇంటి వద్ద, చేల వద్ద కాపలా ఉండేవి. కరోనా తర్వాత అందరికీ ఒంటరి జీవితం విలువ తెలిసింది. దీంతో ఇళ్లలో కుక్కలను పెంచుకోవడం పెరిగింది. కొందరు ప్రెస్టేజ్ కోసం పెట్స్ను పెంచుకుంటుంటే.. కొందరు ఒంటరితనం మర్చిపోవడానికి పెట్స్తో స్నేహం చేస్తున్నారు. అయితే ఈ పెట్స్ కూడా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఒకవైపు వీధికుక్కల దాడుల వార్తలు నిత్యం వింటున్నాం. ఇప్పుడు పెంపుడు కుక్కలు కూడా ప్రమాదమే అంటున్నారు నిపుణులు..
గారాబం చేస్తే..
పెట్స్ను చాలా మంది గారాబం చేస్తున్నారు. వాటికి యాంటీ రేబిస్ ఇంజెక్షన్ వేయించిన తర్వాత ఏం కాదు అన్న నిర్లక్ష్యంతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. బ్రిటన్కు చెందిన 56 ఏళ్ల మంజీత్ సింఘ్ అనే మహిళ, తన పెంపుడు కుక్క ఆమె కాలికి అయిన గాయాన్ని నాటింది. ఇదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పుకుంది. 32 వారాలపాటు ఆసుపత్రిలో పోరాడి, గుండె సంక్షోభాలు ఎదుర్కొని, చివరికి చేతులు, కాళ్లు కోల్పోయి ఇంటికి చేరుకుంది.
Also Read: మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. నేతన్యాహు బలం పెంచేందుకేనా?
కుక్క నోటి ద్వారా బ్యాక్టీరియా..
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కుక్క నోటిలో ఉండే హానికర బ్యాక్టీరియా గాయంలోకి చేరి ’సెప్సిస్’ అంటే రక్త విషప్రయోగానికి దారితీసింది. ఇది శరీరవ్యాప్త వ్యాధి చేసి, అవయవాల దెబ్బతినడానికి కారణమైంది. రేబీస్ లేని పెంపుడు కుక్కల నుంచి కూడా ఇలాంటి ప్రమాదాలు సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ కేసు అరుదైనదైనా, పెంపుడు కుక్కల నాకడం వల్ల సెప్సిస్ ప్రమాదాన్ని సూచిస్తుంది. గాయాలు ఉన్నప్పుడు జంతువులకు దగ్గరలేకుండా ఉండటం, వెంటనే వైద్య సహాయం తీసుకోవడం కీలకం. బ్రిటన్లో ఇలాంటి సంఘటనలు పెరుగుతున్నాయి. కుక్కల నోటి ఫ్లోరా శరీరానికి విషమయ్యేది.