spot_img
Homeజాతీయ వార్తలుPM Kisan and Annadata Sukhibhav schemes : రైతులకు డబుల్ ధమాకా.. ఒకేసారి పిఎం...

PM Kisan and Annadata Sukhibhav schemes : రైతులకు డబుల్ ధమాకా.. ఒకేసారి పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల డబ్బులు అకౌంట్లో…

PM Kisan and Annadata Sukhibhav schemes : తాజాగా ప్రభుత్వం రైతులకు మద్దతుగా మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతుల కోసం అమలు చేస్తుంది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు కూడా ఒక ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందబోతుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అందిస్తున్న పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. ప్రస్తుతం అధికారిక సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ పథకంలో ప్రతి రైతుకు రూ.2 వేలు తోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక రూ.5 వేలు చొప్పున రెండు విడతలలో ఇక చివరిగా మరో రూ.4 వేలు జమ చేయనుంది.

Also Read : పీఎం కిసాన్ స్కీం ప్రత్యేక డ్రైవ్.. మే 31 వరకు మాత్రమే.. రైతులందరూ పేరు నమోదు చేసుకోండి..

ప్రతి ఒక్క రైతుల ఖాతాలలో మూడు విడతలుగా రూ.20 వేలు ప్రభుత్వం జమ చేయబోతుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఈ నెలలోనే 20వ విడత కింద నిధులను అందిస్తుంది. గత ఫిబ్రవరి నెలలో పిఎం కిసాన్ పథకం 19వ విడత నిధులు కేంద్ర ప్రభుత్వం జమ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. పీఎం కిసాన్ పథకం అలాగే అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఏప్రిల్ నుంచి జూలై నెల వరకు తొలి విడత, అలాగే ఆగస్టు నెల నుంచి నవంబర్ నెల వరకు రెండవ విడత ఇక డిసెంబర్ నుంచి మార్చి నెల వరకు మూడవ విడతగా రైతుల ఖాతాలలో చెల్లింపులు జరగనున్నాయి. అయితే పీఎం కిసాన్ పథకం, అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలలో ఈ డబ్బులు జమ కావాలంటే వీళ్ళు కొన్ని ముఖ్యమైన ప్రక్రియలు తప్పనిసరిగా పూర్తి చేయాలి.

ముఖ్యంగా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయ్యి ఉండాలి. రైతుల బ్యాంకు ఖాతా వాళ్ళ ఆధార్ నెంబర్తో లింక్ అయ్యి ఉండాలి. రైతులకు సంబంధించిన భూమి పత్రాలు కూడా అప్డేట్ అయ్యి ఉండడం తప్పనిసరి. రైతులు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం కోసం పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ అయిన www.pmkisan.gov.in లోకి వెళ్లి తమ ఆధార్ నెంబర్ నమోదు చేసుకున్న తర్వాత వచ్చిన ఓటీపీని సబ్మిట్ చేయాలి. మే 31, 2025 వరకు మాత్రమే రైతులకు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి చివరి తేదీ.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Oktelugu Epaper
Exit mobile version