ఎక్స్ క్లూజివ్: రాపాక విషయంలో పవన్ కి హెల్ప్ చేసిన జగన్..! ఏమన్నా రాజకీయమా….?

జనసేన పార్టీ కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇప్పుడు బాగా కోపం తెప్పిసున్నది ఏదైనా ఉంది అంటే…. రాపాక వరప్రసాద్ విషయంలో తమ పార్టీ నిర్లక్ష్యత, నిస్సహాయత. వారంతా రాపాకను తిట్టేందుకు తిట్లు సరిపోక, తిట్టలేక చివరికి తమ కోపాన్ని పవన్ కళ్యాణ్ పై వెళ్లగక్కుతున్నారు. అసలు ఇప్పటివరకు రాపాక వరప్రసాద్ ను పవన్ పార్టీ నుండి సస్పెండ్ చేయకపోవడం ఏమిటి? అతను ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటూ ఇంత అభ్యంతరకరంగా మాట్లాడుతున్నా అతని మాటలను భరించాల్సిన అవసరం […]

Written By: Navya, Updated On : August 12, 2020 1:54 pm
Follow us on

జనసేన పార్టీ కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇప్పుడు బాగా కోపం తెప్పిసున్నది ఏదైనా ఉంది అంటే…. రాపాక వరప్రసాద్ విషయంలో తమ పార్టీ నిర్లక్ష్యత, నిస్సహాయత. వారంతా రాపాకను తిట్టేందుకు తిట్లు సరిపోక, తిట్టలేక చివరికి తమ కోపాన్ని పవన్ కళ్యాణ్ పై వెళ్లగక్కుతున్నారు. అసలు ఇప్పటివరకు రాపాక వరప్రసాద్ ను పవన్ పార్టీ నుండి సస్పెండ్ చేయకపోవడం ఏమిటి? అతను ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటూ ఇంత అభ్యంతరకరంగా మాట్లాడుతున్నా అతని మాటలను భరించాల్సిన అవసరం ఏమిటి? నేరుగా కెమెరా ముందుకు వచ్చి “నేను వైసిపి నాయకుడిగా కొనసాగుతున్నానని… జనసేన గాలికి ఎగిరి పోయే పార్టీ…. దాని మీద నాకు నమ్మకం లేదు…”. అని అన్న తర్వాత కూడా అతనిపై చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణం ఏమిటి? అని అందరి మదిలో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి.

ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ దగ్గర నుండి మనం రెస్పాన్స్ ఆశించడం కొంచెం కష్టతరమైన విషయం అయినా కూడా దీని వెనుక పవన్ పక్కా ప్లాన్ తో ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన వర్గాల్లో మాట ఏమిటంటే…. ఎన్నిసార్లు సస్పెన్షన్ విషయం పార్టీ డిస్కషన్లో వచ్చినా కూడా పవన్ దానిని దాటవేస్తూ ఉన్నారట. ఎప్పటి నుండో రాపాక పై ఒక కన్నేసి ఉంచిన పవన్…. మూడు రాజధానుల విషయంలో అతను అసెంబ్లీలో వ్యతిరేకత చూపించకపోవడం పై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశాడు. అప్పటినుండి పవన్ కళ్యాణ్ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుని సరైన స్ట్రాటజీ తో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

మనం సరిగ్గా గమనించినట్లైతే నర్సాపురం రఘురామరాజు విషయంలో కూడా ముందు వైసీపీ నేతలు తెగ గగ్గోలు పెట్టారు. ఢిల్లీకి పరిగెత్తారు. శాస్వతంగా సస్పెన్షన్ వేద్దామని చూశారు. ఆ ప్రాసెస్ మొత్తం లో కూడా రఘురామ రాజు పైచేయి సాధించారు. ఎంతో పవర్ పెట్టుకున్న వారు ఒక లీడర్ పైన ఏ చర్యలు తీసుకున్నా కూడా మొత్తం ఫోకస్ అనేది అటువైపు కి షిఫ్ట్ అవుతుంది. ఒక్కసారిగా అతని రేంజ్ ను పెంచేసినట్లు ఉంటుంది. కొద్దికాలం గడిచిండి…. వైసీపీ వారికి తమ తప్పు తెలిసొచ్చింది. ఇప్పుడు ఎంపీ రాజు గారు రోజూఏదో ఒక విషయంలో జగన్ సర్కార్ ను తిడుతున్నా…. ఆరోపణలు చేస్తున్నా…. గొతు చించుకొని విరుచుకుపడుతున్నా…. పట్టించుకునే నాథుడే లేడు. ఎందుకంటే అతని మాటలకు ఇప్పుడు వైసీపీ నేతల్య్ రియాక్ట్ వాట్లేదు. జగన్ ఇదే విషయాన్ని గమనించాడు.. అలాంటి వారితో ఎలా నడుచుకోవాలో పవన్ కు నేర్పించాడు. అసలు ఇప్పుడైతే జనాలు ఎంపీ రాజుని పూచిక పుల్ల కన్నా ఘోరంగా తీసిపారేస్తుండడం గమనార్హం.

ఇప్పుడు పవన్ కూడా దాదాపు అదే స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాడు. కనీసం షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు కూడా మొగ్గు చూప్పట్లేదు. ఇప్పటికీ అతను ‘వెన్నుపోటు’ దారుడు, నీచ రాజకీయాలు చేసేవాడు అని వైసిపి, టిడిపి సపోర్టర్లలో కూడా బలమైన ముద్ర పడిపోయింది .ఎట్టిపరిస్థితుల్లోనూ అటువంటి వ్యక్తిని జగన్ తన పార్టీ లోకి రానివ్వను అన్నది అందరి నమ్మకం. జనసేన కూడా తిరుగి అతనిని ఆదరించే అవకాశాలున్నాయి నూటికి నూరు శాతం లేవు. ఏ పార్టీ కి వెళ్తాడు …?ఎక్కడ తన బాధ చెప్పుకుంటాడు.

ఐదేళ్లు పదవిలో ఉన్నా కూడా రాపాక… ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ.. అందరి దగ్గర వెన్నుపోటు దారుడు అనే ముద్రతో బ్రతుకుతూ ఉండాలన్నది పవన్ వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మరి వాళ్ళు చేసే తీవ్ర విమర్శలకు కోపం వచ్చి అతని ఏమైనా చేయాల్సిందే కానీ పవన్ మాత్రం పక్కా ప్లాన్ తో అతనిని పట్టించుకోకపోవడమే…. అతనిని శిక్షించడం అని ఫిక్స్ అయిపోయాడు.