Homeజాతీయ వార్తలుP Lakshmanan Passed Away: మీసాల పిల్లోడు.. శ్రీపాద రక్షకుడు.. సమాజం గుర్తించని దేశభక్తుడు!

P Lakshmanan Passed Away: మీసాల పిల్లోడు.. శ్రీపాద రక్షకుడు.. సమాజం గుర్తించని దేశభక్తుడు!

P Lakshmanan Passed Away: దేశం కోసం శతాబ్దాలుగా ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు. పోరాడారు, ఆస్తులు, ఆప్తులను పోగొట్టకున్నారు. అనుకున్నది సాధించారు. అయితే చాలా మందికి సమాజంలో గుర్తింపు దక్కలేదు. కొందరు గుర్తింపు కోరుకోలేదు. అలాంటి వాటిరో పి.లక్ష్మణన్‌ ఒకరు. తమిళనాడుకు చెందిన లక్ష్మణన్‌ కన్యాకుమారి వివేకానంద కేంద్రంలో 86 ఏళ్ల వయసుసలో 2026, జనవరి 22న మరణించాడు. యవ్వనంలో దట్టమైన మీసాలతో ‘మీసాల పిల్లోడు’గా పేరు పొందిన ఆయన త్యాగం స్మృతుల్లో మునిగిపోతోంది. […]

P Lakshmanan Passed Away: దేశం కోసం శతాబ్దాలుగా ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు. పోరాడారు, ఆస్తులు, ఆప్తులను పోగొట్టకున్నారు. అనుకున్నది సాధించారు. అయితే చాలా మందికి సమాజంలో గుర్తింపు దక్కలేదు. కొందరు గుర్తింపు కోరుకోలేదు. అలాంటి వాటిరో పి.లక్ష్మణన్‌ ఒకరు. తమిళనాడుకు చెందిన లక్ష్మణన్‌ కన్యాకుమారి వివేకానంద కేంద్రంలో 86 ఏళ్ల వయసుసలో 2026, జనవరి 22న మరణించాడు. యవ్వనంలో దట్టమైన మీసాలతో ‘మీసాల పిల్లోడు’గా పేరు పొందిన ఆయన త్యాగం స్మృతుల్లో మునిగిపోతోంది.

1962 శ్రీపాద రక్షణ పోరాటం
భారత దేశపు దక్షిణ కొస భద్రంగా ఉంది. అక్కడ అద్భుతమైన తీర్థం ఉంది. వివేకానంద శిలా స్మారకం ఉంది. దానిని శ్రీపాద శిల అంటారు. వివేకానందుడు ఇక్కడ తపస్సు చేశారు. తర్వాత రామకృష్ణ మిషన్‌ స్థాపించారు. వివేకానందుడిని మార్గదర్శనం చేసిన ప్రదేశం శ్రీపాద శిలగా గుర్తింపు పొందింది. అప్పట్లో శ్రీపాద ప్రాంతంలో క్రైస్తవులు శిలువ ఏర్పాటు చేశారు. కన్యాకుమారి జిల్లా పేరును కన్యామేరీ జిల్లాగా మార్చారు. దీనికి వ్యతిరేకంగా అప్పుడు పోరాటం జరిగింది. 1962 అక్టోబర్ 8న పి.లక్ష్మణ్‌తోపాటు 14 మంది యువకులు వివేకానందుడు పాదం మోపిన శ్రీపాద రక్షణకు పోరాడారు. భుజంపై వివేకానంద విగ్రహం కట్టుకుని సముద్రమార్గం ఈదుకుని శ్రీపాద శిలను ప్రతిష్టించారు. స్వామి వివేకానందుడు తపస్సు చేసిన ఈ పవిత్ర ప్రదేశాన్ని కాపాడటానికి ఆర్‌ఎస్‌ఎస్ సంకల్పం తీర్చిదిద్దారు. బాలన్ నేతృత్వంలో ఎన్‌పీ.నారాయణన్, చంద్రన్, రామన్, అత్యున్, శ్రీధరన్, దాసన్, కణ్ణన్‌తో కలిసి శిలువను తొలగించి విగ్రహం ప్రతిష్ఠాపించారు. జిల్లా పేరు కన్యాకుమారిగా మార్చేందుకు మత్స్యకారులు, రెక్కాళ్లు ముందుంటే దక్షిణ తీరం రక్షణకు ఆయన త్యాగం కీలకం.

స్మారకం నిర్మాణం..
ఇటు స్వామి వివేకానందుని శ్రీపాద శిలను కాపాడాలి, జిల్లా పేరు కన్యాకుమారి అని రుజువు చేయాలి. ప్రజల్లో భయం పోగొట్టాలి. ఈ పని చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ సేవలకు నిర్ణయించారు. వివేకానందుని శతజయంతి సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ సెక్రటరీ జనరల్ ఏకనాథ్ రండే బాధ్యత అప్పగించారు. 400 మంది ఎంపీల సంతకాలు, ప్రజల దానాలతో శిలా స్మారకం నిర్మించారు. లక్ష్మణ్ ఆ కేంద్రంలోనే వృద్ధాప్యం గడిపి నిస్వార్థంగా సేవ చేశారు. ఆయన బ్యాచ్‌లో ఎం.దాసన్, ఏవీ.బాలన్ మాత్రమే బతికి ఉన్నారు.

ఈ మొత్తం పనికి పునాది వేసిన వారిలో పి.లక్ష్మణన్‌. వయసు మీదపడిన తర్వాత ఈ కేంద్రంలోనే గడిపారు. 86 ఏళ్ల వయసులో చనిపోయారు. ఎలాంటి ప్రచారం లేకుండా నిస్వార్థ భావనతో దేశం కోసం, స్వామి వివేకానంద స్మృతిని నిలిపేందుకు పోరాటం చేశాడు.
దేశ సేవలో అనేక మంది అనామక వీరులు ఉన్నారు. 15 రోజుల తర్వాత చైనా ఉత్తర లోయల్లో దాడి చేసినప్పుడు కూడా యువకులు పోరాడారు. లక్ష్మణ్ వంటి త్యాగాలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper