కరోనా కష్టకాలంలో మనసున్న సీఎం ఆయనే

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. ఎక్కడ ప్రజలకు అవస్థ కలిగినా తక్షణమే స్పందించే పట్నాయక్ ప్రస్తుతం ఆక్సిజన్ కొరత ఉన్న స్టేట్లకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రజా అవసరాలే పరమావధిగా పని చేసే వారు కొందరే ఉంటారు. వారిలో నవీన్ ఒకరు. మన దేశం గర్వించదగ్గ నాయకుల్లో నవీన్ పట్నాయక్ కు ఖచ్చితంగా స్థానం ఉంటుంది. అందుకే […]

Written By: Srinivas, Updated On : May 7, 2021 9:19 am
Follow us on

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. ఎక్కడ ప్రజలకు అవస్థ కలిగినా తక్షణమే స్పందించే పట్నాయక్ ప్రస్తుతం ఆక్సిజన్ కొరత ఉన్న స్టేట్లకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రజా అవసరాలే పరమావధిగా పని చేసే వారు కొందరే ఉంటారు. వారిలో నవీన్ ఒకరు. మన దేశం గర్వించదగ్గ నాయకుల్లో నవీన్ పట్నాయక్ కు ఖచ్చితంగా స్థానం ఉంటుంది. అందుకే ఆయన సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉంటున్నారు. విజయం సాధిస్తున్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు పట్టించుకునే పట్నాయక్ ఇతర సమయాల్లో ప్రజాసేవకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకే అందరికీ ప్రియతమ నేతగా గుర్తింపు పొందారు.

ఆక్సిజన్ కొరతను గుర్తించి

దేశమంతా కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రజంతా భయాందోళనకు గురవుతున్నారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించింది. దీంతో ఆక్సిజన్ అవసరాలను గుర్తించిన పట్నాయక్ దాన్ని సరఫరా చేసేందుకు నడుం బిగించారు. ఆక్సిజన్ అవసరమైన స్టేట్లకు సరఫరా చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ సాయాన్ని పలువురు కీర్తిస్తున్నారు. ఆపద సమయంలో ఆదుకునే దేవుడిగా అభివర్ణిస్తున్నారు.

రాజకీయాలంటే పెద్దగా పట్టించుకోరు

నవీన్ పట్నాయక్ రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోరు. వాటిని తృణప్రాయంగా భావిస్తారు. కేవలం ఎన్నికల సమయంలోనే ప్రచారం చేస్తారు. మిగతా టైంలో ప్రజాసేవకే మొగ్గు చూపుతారు. అందుకే ఆయన పోటీ చేసిన ప్రతిసారి విజయం సాధిస్తారు. ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. ఆయన నిష్కళంక మనస్థత్వంతోనే రాజకీయంగా రాణిస్తారు. ప్రజల మనసులో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారు.

ఉత్పత్తిని పెంచడం ద్వారా

ఆక్సిజన్ అవసరాలను గుర్తించి వాటి ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇతర స్టేట్లకు పంపాలని భావించారు. దీంతో ఒడిశాలోని జాజ్ పూర్ టాటా స్టీల్ ప్లాంట్, అనుగుల్ లోని జిందాల్, భూషణ్, ఇడ్కో వంటి సంస్థల్లో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడి నుంచి తెలంగాణ, ఏపీ, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్లకు పంపించాలని భావించారు. నవీన్ పట్నాయక్ ఉదార స్వభావానికి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రజల కోసం బతికే వారు కొందరుంటే ప్రజలను పీడించే వారు కొందరుంటారు. పట్నాయక్ మొదటి కోవకు చెందిన వ్యక్తి. అందుకే ఆయన ప్రజల మనసులోనే చిరస్థాయిగా నిలిచిపోతారు.