Homeఆంధ్రప్రదేశ్‌AP Opposition Leaders: విపక్ష నేతలకు నో సెక్యూరిటీ... ఏపీలో ఫ్యాక్షన్ పాలన

AP Opposition Leaders: విపక్ష నేతలకు నో సెక్యూరిటీ… ఏపీలో ఫ్యాక్షన్ పాలన

AP Opposition Leaders: ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్ వ్యవస్థ అధికార పక్షానికి దాసోహమన్నట్టు వ్యవహరిస్తోంది. నడి రోడ్డుపై హత్యాయత్నాలు చేసేవారికి ప్రొటక్షన్ కల్పిస్తున్నారు. అటువంటి వారు నేరుగా పోలీస్ స్టేషన్లలో పుట్టిన రోజు వేడుకలు చేసుకునే వెసులబాటు ఏపీలో ఉంది. కానీ ప్రజాస్వామ్యయుతంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న విపక్ష నేతలను మాత్రం ఎలాంటి సెక్యూరిటీ కల్పించలేని నిస్సహాయ స్థితిలో పోలీస్ శాఖ ఉంది. వారు ఇంటి నుంచి బయలుదేరే సమయానికి ప్రత్యక్షమవుతున్నారు. హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఒక వేళ సాహిసించి అడుగు బయటపెడితే కృత్రిమ ఉద్రిక్తతలకు తావిచ్చి.. వాటినే సాకుగా చూపి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రీ ప్లాన్డ్ గా విద్యుత్ లైట్లు ఆపేసి రాళ్ల దాడికి పురమాయిస్తున్నారు. పోలీసుల సహకారంతో అధికార పార్టీ నేతల చర్యలు ఇటీవల శృతిమించుతున్నాయి.

AP Opposition Leaders
pawan kalyan- chandrababu

విపక్ష నేతలు అయితే దాడులు.. లేకపోతే కేసులు అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ప్రతిపక్ష నేతలెవరూ స్వేచ్ఛగా తిరిగే రోజులు కనిపించడం లేదు. ఎక్కడైనా వారు పర్యటిస్తామంటే వైసీపీ నేతలు విధ్వంసాలకు దిగుతున్నారు. ఆ పర్యటనలను వివాదాస్పదం చేస్తున్నారు. సహజంగా ఇది పోలీస్ శాఖ పనితీరును ప్రశ్నార్థకమవుతుంది. కొంతమంది అధికారులు అత్యుత్సాహం, అధికార పక్షానికి దాసోహం.. మొత్తం పోలీస్ వ్యవస్థకే మచ్చగా మారుతోంది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ తప్పిదంగా భావించే వారు రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్నారు. ఇది అల్టిమేట్ గా వైసీపీ సర్కారు పనితీరును ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి దూకుడు చర్యలకు దిగుతోందని.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకూడదనే వ్యూహాత్మకంగా దాడులు చేయిస్తుందని మెజార్టీ ప్రజలు నమ్ముతున్నారు. ఈ అభిప్రాయం రోజురోజుకూ పెరుగుతోంది.

జనసేన అధినేత పవన్ విశాఖ పర్యటనను ఇటువంటి ప్లాన్ తోనే అడ్డుకున్నారు. జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా హోటల్ కే పరిమితం చేశారు. విశాఖ నుంచి బలవంతంగా విజయవాడ పంపించారు. ఇటీవల విపక్ష నేత చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా పనిగట్టుకొని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. విధ్వంసాలకు దిగుతున్నారు. నందిగామ పర్యటనలో చంద్రబాబును టార్గెట్ గా చేసుకొని రాయి విసిరారు. అది భద్రతా సిబ్బంది ఒకరికి తగలడంతో గాయమైంది. అదే చంద్రబాబుకు తిగిలి ఉంటే పరిస్థితి ఏమిటి? చర్యకు ప్రతిచర్య అన్నట్టు టీడీపీ శ్రేణులు కూడా ఎదురుతిరిగితే శాంతిభద్రతల పరిస్థితి ఏమిటి? అటు సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించిన ప్రతిసారి అధికార పార్టీ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. విపక్ష నేత, జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న నాయకుడు అని చూడకుండా రాళ్ల దాడికి దిగుతున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారు.

AP Opposition Leaders
jagan

పోలీసులు ఉన్నది ప్రజల మాన, ప్రాణాలను కాపాడేందుకేనని గుర్తెరగాలి. కానీ తాము భద్రతకు కాదు.. ఉద్రిక్తతలను పురమాయించడానికేనంటూ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉంటోంది. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే.. దానిని అడ్డుకోకండి కానీ.. పోటీగా గర్జనలు ఏర్పాటుచేసుకోండి అని సాక్షాత్ రాష్ట్ర పోలీస్ బాసే సూచించడం దేనికి సంకేతం? ఒకటి మాత్రం సూటిగా చెప్పొచ్చు. ఏపీలో సామాన్యుడి నుంచి విపక్ష నేతల వరకూ భద్రత కొరవడింది. అది ప్రజలకు ప్రభుత్వం అప నమ్మకం కలిగేలా చేస్తోంది. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత కూడా వైసీపీ సర్కారుదే. ప్రజాగ్రహానికి గురికాక తప్పదని విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version