మాజీ మంత్రి అయ్యన్నపై నిర్భయ కేసు..!

టీడీపీ నేతలపై కేసుల నమోదు పర్వం కొనసాగుతుంది. కొద్దీ రోజుల కిందట మాజీ మంత్రులు నిమ్మకాయల చిన రాజప్ప, యనమల రామకృష్ణుడులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. ఇది ఇలా ఉండగా విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై నిర్భయ కేసు నమోదయ్యింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే అసభ్యకరంగా దుర్భాష లాడారని అయ్యన్నపాత్రుడుపై నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సీపట్నం పురపాలక […]

Written By: Neelambaram, Updated On : June 17, 2020 10:31 am
Follow us on


టీడీపీ నేతలపై కేసుల నమోదు పర్వం కొనసాగుతుంది. కొద్దీ రోజుల కిందట మాజీ మంత్రులు నిమ్మకాయల చిన రాజప్ప, యనమల రామకృష్ణుడులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. ఇది ఇలా ఉండగా విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై నిర్భయ కేసు నమోదయ్యింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే అసభ్యకరంగా దుర్భాష లాడారని అయ్యన్నపాత్రుడుపై నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నర్సీపట్నం పురపాలక సంఘం కార్యాలయంలో మాజీ సర్పంచి రుత్తుల లాచ్చాపాత్రుడు చిత్రపటాన్ని తొలగించింనందుకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ వ్యాఖ్యలు చేశారని మున్సిపల్ కమిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు అయ్యన్న పాత్రుడుపై 354(ఏ),500, 504, 506, 509, 505(బి) సెక్షన్లు కింద కేసు నమోదు చేసినట్లు నర్సీపట్నం సిఐ స్వామి నాయుడు తెలిపారు.