వైసీపీలోకి వేస్ట్‌గా వచ్చానా..!: మోహన్‌బాబు పశ్చాత్తాపం

మోహన్‌బాబు.. టాలీవుడ్‌ డైలాగ్‌ కింగ్‌. టాలీవుడ్‌లో ఎన్నో సక్సెస్‌ ఫుల్‌ సినిమాలు తీసి.. సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. అలాంటి మోహన్‌బాబు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. అయితే.. ఆ పార్టీలో ఆయనకు సరైన ఇంపార్టెన్స్‌ దొరకడం లేదట. అసలు ఈ పార్టీలోకి తాను ఎందుకు వచ్చానా అన్న అభిప్రాయానికి మోహన్‌బాబు వచ్చినట్లుగా తెలుస్తోంది. Also Read: బాబు గారూ ఇదేమి రాజకీయం : ఆశ్చర్యపోతున్న టీడీపీ క్యాడర్‌‌ ముఖ్యమంత్రి అన్నాక అన్ని వర్గాలనూ కలుపుకుని పోవాలి. […]

Written By: Srinivas, Updated On : February 2, 2021 11:12 am
Follow us on


మోహన్‌బాబు.. టాలీవుడ్‌ డైలాగ్‌ కింగ్‌. టాలీవుడ్‌లో ఎన్నో సక్సెస్‌ ఫుల్‌ సినిమాలు తీసి.. సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. అలాంటి మోహన్‌బాబు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. అయితే.. ఆ పార్టీలో ఆయనకు సరైన ఇంపార్టెన్స్‌ దొరకడం లేదట. అసలు ఈ పార్టీలోకి తాను ఎందుకు వచ్చానా అన్న అభిప్రాయానికి మోహన్‌బాబు వచ్చినట్లుగా తెలుస్తోంది.

Also Read: బాబు గారూ ఇదేమి రాజకీయం : ఆశ్చర్యపోతున్న టీడీపీ క్యాడర్
‌‌

ముఖ్యమంత్రి అన్నాక అన్ని వర్గాలనూ కలుపుకుని పోవాలి. అందరివాడు అనిపించుకోవాలి. కానీ.. జగన్ మాత్రం ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఒక వర్గాన్ని టార్గెట్ చేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు. జగన్ ముఖ్యమంత్రి కాగానే కమ్మ సామాజకవర్గాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నది వాస్తవం. స్వతహాగా వ్యాపార, కాంట్రాక్టర్లుగా ఉన్న వారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారన్న విమర్శ సర్వత్రా వినిపిస్తోంది. రాజధాని అమరావతి నుంచి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు వరకూ ఆ సామాజికవర్గాన్ని తొక్కేందుకు జగన్ ప్రయత్నించారని ప్రధాన ఆరోపణ. నిజంగానే కమ్మ సామాజికవర్గంలో అత్యధికులు గత ఎన్నికల్లో చంద్రబాబుకు అండగా నిలిచారు. ఆర్థికంగా సాయమందించినా బాబు గెలవలేదు. అయితే.. అదే సమయంలో జగన్‌ను సపోర్టు చేసిన కమ్మ సామాజికవర్గం నేతలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో సినీ నటుడు మోహన్ బాబు ఒకరు.

Also Read: అచ్చెన్నను మళ్లీ జైలుకు పంపిన వైసీపీ సర్కార్

మోహన్‌బాబు మాటలకు ఉన్న వ్యాల్యూ వేరు. ఎన్నికలకు ముందు చంద్రబాబును మోహన్ బాబు ఒక ఆట ఆడుకున్నారు. చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదని చెప్పారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. మోహన్ బాబు వల్ల ఎంత పార్టీకి ప్రయోజనం జరిగిందన్నది పక్కన పెడితే, ఆయన రాకతో వైసీపీ బలం పెరిగిందని మాత్రం చెప్పవచ్చు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబును జగన్ పట్టించుకోవడం మానేశారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

మోహన్‌బాబుకు ముందు నుంచీ ఎన్టీఆర్‌‌ అంటే ఇష్టం. ఎన్టీఆర్‌‌ రజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచే మోహన్‌బాబుకు కూడా రాజకీయాల్లోకి రావడం ఇష్టం. ఆయన రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు. మరోసారి పెద్దల సభకు వెళ్లాలని భావిస్తున్నారు. కానీ.. జగన్ మాత్రం పట్టించుకోవడం లేదు. తనపై ఉన్న యాంటీ కమ్మ ముద్రను తొలగించుకోవాలంటే జగన్ మోహన్ బాబుకు పదవి ఇవ్వాలన్న కామెంట్స్ కూడా పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. జగన్ మంత్రివర్గంలో కొడాలి నాని ఒక్కరికే అవకాశమిచ్చారు. ఇప్పటివరకూ భర్తీ అయిన పదవులను కమ్మ సామాజికవర్గానికి ఇవ్వలేదన్న ప్రశ్నకు కూడా జగన్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మోహన్ బాబుకు పదవి ఇచ్చి అందరివాడు అనిపించుకోవాలన్నది వైసీపీలో ఉన్న కమ్మ సామాజికవర్గం నేతల భావన. మరి దీనిని జగన్‌ ఏ మేరకు లెక్కలోకి తీసుకుంటారో చూడాలి.