spot_img
Homeఅంతర్జాతీయంPM Modi- Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య మోడీ మైత్రి: ఏకంగా అణు...

PM Modi- Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య మోడీ మైత్రి: ఏకంగా అణు యుద్ధాన్నే ఆపాడు

PM Modi- Russia Ukraine War: పాకిస్తాన్ దూషించవచ్చు గాక. ఇండియాలో ఉన్న ఎడమ చేతివాటం రాజకీయ నాయకులు, కెసిఆర్ లాంటివాళ్ళు తిట్టవచ్చు గాక.. కానీ ప్రపంచం మోదీని కొనియాడుతూనే ఉంటుంది. మోడీ కూడా ప్రపంచ క్షేమం కోసం తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉంటాడు.. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లు సరఫరా చేసి తన ఉదారత చాటుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శ్రీలంకకు చమురు, ఆహార ధాన్యాలు ఎగుమతి చేసి తన సహృదయతను ప్రదర్శించాడు.. అగ్రరాజ్యం అమెరికా గడ్డ పై హౌడీ మోడీ అనే ప్రోగ్రాం లో లక్షలాది మంది అమెరికన్ల అభిమానం చూరగొన్నాడు. ఇప్పుడు జీ_20 దేశాల సమ్మిట్ కు అధ్యక్ష బాధ్యత వహిస్తున్నాడు.. ప్రపంచ దేశాల వేదికలపై చైనా, పాక్ దుర్నీతిని ఎక్కడికక్కడ ఎండ గడుతున్నాడు.

PM Modi- Russia Ukraine War
PM Modi- Russia Ukraine War

యుద్దాన్ని ఆపాడు

గత ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది.. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. మొదట్లో ఉక్రెయిన్ కు మద్దతుగా ఉన్న నాటో దేశాలు తర్వాత చేతులు ఎత్తేసాయి.. దీంతో రష్యా ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. కీవ్, మారియా పోల్ లాంటి నగరాలను ఆక్రమించుకుంది. అంతేకాదు ఉక్రెయిన్ లోని ఆయిల్ రిపైనరీల మీద భీకర దాడులు చేసింది. దీంతో యూరప్ దేశాలకు చమురు రవాణా నిలిచిపోయింది. ఇంత జరుగుతున్నా అటు ఐక్య రాజ్య సమితి, ఇటు ఆమెరికా చోద్యం చూశాయి. పోరు నష్టం పొందు లాభం అన్న తీరుగా మిగతా దేశాలు వ్యవహరించాయి. ఒక్క భారత్ తప్ప. కానీ ఈవిషయం లో భారత్ ప్రపంచ క్షేమాన్ని కోరుకున్నది.

PM Modi- Russia Ukraine War
PM Modi- Russia Ukraine War

సీఐఏ కొనియాడింది

“నీ వెంట పది మంది ఉన్నారంటే ఒక యుద్దాన్ని గెలవచ్చు. అదే పది మందికి నువ్వు ఉన్నావనే నమ్మకం ఉంటే ఒక యుద్దాన్నే ఆపోచ్చు.” ఇది కేజీఎఫ్ లో రాఖీ కి అతడి తల్లి చెప్పే మాట. బహుశా దీన్నే మోడీ ఆచరణలో పెట్టాడు. ఏకంగా ఒక యుద్దాన్ని ఆపాడు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అణ్వాయుధ ప్రయోగం జరగకుండా చూశారు. దీనివల్ల పెను విద్వంసాన్ని తప్పించారు. మోడీ మాటలు, అతడి ప్రసంగాలు అణ్వాయుధాల వినియోగంపై రష్యన్ల పై ప్రభావం చూపాయి. అంతేకాదు పలు అంతర్జాతీయ వేదికల్లో యుద్ధం వల్ల జరిగే అనర్థాలను వివరించారు. మోడీ, బెలెన్ స్కీ తో కూడా మాట్లాడారు.. వీటివల్ల పుతిన్ మనసు మార్చుకున్నారు. అణ్వాయుధ యుద్దాన్ని పక్కన పెట్టారు. ఈ విషయాన్ని సీఐఏ డైరెక్టర్ బిల్ బర్న్స్ ఇటీవల వెల్లడించారు..మోడీ అణు యుద్దాన్ని ఆపారు అని కొనియాడారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper
Exit mobile version