Homeజాతీయ వార్తలుUP CM Adityanath Yogi: మోడీ రిటైర్ మెంట్.. యోగికి అపాయింట్ మెంట్?

UP CM Adityanath Yogi: మోడీ రిటైర్ మెంట్.. యోగికి అపాయింట్ మెంట్?

UP CM Adityanath Yogi: దేశంలో అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించింది. ఈనేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి యూపీ కాబోయే సీఎం ఆదిత్యనాథ్ పై పడుతోంది. రాబోయే కాలంలో కాబోయే ప్రధానిగా యోగిని సూచిస్తున్నారు. దీనికి అమిత్ షా సైతం సహజంగానే అభివర్ణిస్తున్నారు. దీంతో యోగిపై గురుతర బాధ్యత ఉందని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఎవరనేదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయంలో ఓ అంచనాకు రాలేకపోతున్నారు.

UP CM Adityanath Yogi
Modi, Yogi

బీజేపీలో ఉన్న సంప్రదాయం ప్రకారం 70 ఏళ్లు దాటిన వారికి కీలక పదవులు ఇవ్వరు. దీంతోనే ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతి లాంటి వారు రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు తెలిసిందే. దీంతో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ వయసు 71 ఏళ్లు కావడంతో వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయసు 73 ఏళ్లకు చేరుతుంది. ఈ కారణంగా ఆయన ప్రధాని పదవికి అనర్హులు అవుతారు. ఈ కారణంగా భావిభారత ప్రధాని ఎవరనే విషయంలో చాలా మంది నేతలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని అమిత్ షా కూడా సమ్మతిస్తున్నారు.

Also Read: ఇదో చరిత్ర: యూపీలో రెండోసారి బీజేపీ గెలవడానికి కారణాలివీ!

ఉత్తరప్రదేశ్ లో రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి యోగి విధానాలు కూడా కారణంగా తెలుస్తోంది. అందుకే దేశంలో ప్రధాని పదవికి యోగినే అర్హుడిగా కొందరు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో యోగి నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో యోగిపై కీలక బాధ్యతలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలోనే పెద్ద రాష్ట్రాన్ని రోల్ చేసిన యోగి దేశాన్ని కూడా నడిపించగలరనే అభిప్రాయం అందరిలో వస్తోంది.

UP CM Adityanath Yogi
UP CM Adityanath Yogi

నరేంద్ర మోడీ రిటైర్మెంట్ ఖాయంగా కనిపిస్తోంది. ఆయనకు రాష్ట్రపతి పదవి ఇచ్చేందుకు పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. మోడీ తరువాత అంతే స్థాయి నేతగా యోగి ఎదిగే అవకాశం ఉంది. దీంతో కాబోయే ప్రధాని యోగిగా భావిస్తున్నారు. యూపీలో యోగి సాధించిన విజయాలు పార్టీకి ప్లస్ కానున్నాయి. దీంతోనే అక్కడ బీజేపీ రెండోసారి అదికారంలోకి వచ్చింది. 37 ఏళ్ల తరువాత ఒకే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం జరిగిందంటే యోగి కృషి ఎంత ఉందో అర్థం అవుతోంది.

మోడీ వయసు నిబంధనల కారణంగా పీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ దృష్టి సారిస్తోంది. మరోవైపు అమిత్ షాకు కూడా అవకాశాలు ఉన్నాయి. దీంతో భవిష్యత్ ప్రధాని ఎవరనే దానిపై బీజేపీనే స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. పార్టీ విధానాల మేరకు ఎవరిని ప్రధాని అభ్యర్థిగా చేస్తారో అంతుచిక్కడం లేదు.

Also Read: యూపీలో ఎంఐఎం వల్ల ఎస్పీ ఘోరంగా ఓడిపోయిందా? బీజేపీ గెలిచిందా?

 

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

5 COMMENTS

  1. […] Power Star Pawan Kalyan-Arvind Kejriwal: యుద్ధంలోకి దిగాక విజయమో.. వీర స్వర్గమో అన్నట్టుగా ముందుకెళ్లాలి. ఈ విషయంలో ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదర్శంగా నిలుస్తున్నారు. అన్నా హాజరే బ్యాచ్ లో నీతిమంతమైన రాజకీయాల కోసం గళమెత్తిన ఆయన 2012లో ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా పాలనతోనే మెరుగైన సమాజం సాధ్యమని ఢిల్లీలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అన్నా హాజరేను ఎదురించారు. ఆయన సిద్ధాంతాలను పక్కనపెట్టారు. కేజ్రీవాల్ నేరుగా ప్రజల్లోకి వెళ్లారు. వారితోనే ఉన్నారు. తన వాణి వినిపించారు. మొదటిసారే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి 28 సీట్లు వచ్చినా కుంగిపోలేదు. అనంతరం ప్రజల మెప్పు పొంది వరుసగా ఢిల్లీకి సీఎం అయ్యారు. బీజేపీని చిత్తుగా ఓడించి గెలుపుబావుటా ఎగురవేశారు. […]

  2. […] CM KCR Health: సీఎం కేసీఆర్ సడెన్ గా ఈరోజు ఉదయం యశోదా ఆస్పత్రికి వెళ్లడం సర్వత్రా సంచలనం రేపింది. ఆయన అస్వస్థతకు గురయ్యారని, తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారంటూ అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాగా ఈ వార్తలపై యశోద ఆసుపత్రి డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు. […]

  3. […] AP Budget 2022-23:  ఏపీలో ఇప్పుడు బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. కాగా ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్ర బ‌డ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు. అయితే ఈ సారి ఆయ‌న మాట‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఎందుకంటే ఆయ‌న తమిళ కవి తిరువళ్లువార్ మాటలతో బడ్జెట్ ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. ఇందులో జ‌గ‌న్ ను పొగిడే కార్య‌క్ర‌మంలో భాగంగా ఆ లైన్ ను తీసుకున్నార‌ని త‌ర్వాత అర్థ‌మైంది. […]

  4. […] Bandi Sanjay Tweet On KCR Health: తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అనారోగ్యంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించారు వైద్యులు. అన్ని రిపోర్టులు నార్మల్ గానే ఉన్నాయని ఇంకా కొన్ని రిపోర్టులు రావాల్సి ఉందని అప్పుడు కానీ స్పష్టత ఇవ్వలేమని వైద్యులు సూచిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన అమ్మవారి కృప వల్ల కోలుకోవాలని ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని కోరుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular