99 శాతం కేసుల్లో వివాహేతర సంబంధం ముగింపు.. అత్యంత దారుణంగా ఉంది. విషాదమే అంతిమ గమ్యం అవుతుంది. ఇలాంటి ఘటనలు ఇప్పటి వరకూ విన్నవారూ, చూసినవారు కూడా చివరకు అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. అదేవిధమైన ముగింపును తెచ్చిపెట్టుకుంటున్నారు. హర్యానా రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన తీవ్ర విషాదానికి కారణమైంది.
కర్నల్ జిల్లాకు చెందిన ఓ మహిళకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా. హాయిగా సంసారం సాగిపోతుండగా.. ఆమె బుద్ధి మాత్రం బజారుకెక్కింది. ఎదురింటిలో ఉండే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది ఎంతగా ముదిరిందంటే.. అతడి కోసం భర్తను, పిల్లలను సైతం వదలుకునేంతగా బలపడింది. ఈ విషయం తెలిసిన భర్త, ఆమె తండ్రి బుద్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. అయినా.. పద్ధతి మార్చుకోలేదు.
ఈ క్రమంలోనే.. ఇంటి నుంచి పారిపోవడానికి సిద్ధమైంది. అర్ధరాత్రి వేళ ఇంట్లోని బంగారం, డబ్బులు అన్నీ సర్దుకొని ఎదురింటి యువకుడితో వెళ్లిపోయింది. అంతేకాదు.. ఆ తర్వాత భర్తకు ఫోన్ చేసి, తాను అతడిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అంతేకాకుండా.. మళ్లీ అదే ఊరికి వస్తామని, ఎదురింట్లోనే కాపురం పెడతానని, పిల్లలను కూడా తామే పెంచుకుంటామని చెప్పిందట.
దీంతో.. తీవ్ర మనోవేదనకు గురైన భర్త దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. అయితే.. తాను చనిపోయిన తర్వాత పిల్లల భవిష్యత్ ఏమైపోతుందోనని భయపడ్డాడో ఏమో.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపేశాడు. అనంతరం తాను కూడా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ ఘటనకు కారణమైన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.