
దేశంలోకి కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఈనెల 14నాటికి లాక్డౌన్ పూర్తి కానుంది. శనివారం జరిగే ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ప్రధాని మోదీ లాక్డౌన్ కొనసాగింపుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ పొడగించాయి. తెలంగాణలోనూ లాక్డౌన్ పొడగించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా తెలంగాణపై రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తుంది.
ఈమేరకు తెలంగాణలో ఇళ్ల నుంచి బయటికి వచ్చే ప్రతీఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇళ్లలో తయారుచేసిన క్లాత్ మాస్కులకు అనుమతినిచ్చింది. మాస్కులు ధరించకుండా వీధుల్లోకి వస్తే పోలీసులు జరిమానాలు విధించటంతోపాటు కేసులు నమోదు చేయనున్నారు. అదేవిధంగా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కరోనా వ్యాప్తి చెందకుండా చూడాలని ప్రభుత్వం కోరుతుంది.
ఈమేరకు ఉమ్మి వేయటంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్త వారిపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. అవసరమైతే వారిని అరెస్టు చేయనున్నారు. శనివారం వీధుల్లో ఉమ్మేసిన ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా లేకుండా జైలుకెళ్లడం ఖాయంగా కన్పిస్తుంది. జరభ్రదం.. సుమా! వీటన్నింటి బదులు ఇంట్లోనే ఉండటం బెటర్.