
దేశంలో కరోనా ఎఫెక్ట్ తో ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావడానికే జంకుతున్నారు. ఈ పరిస్థితుల్లో అకాల వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దిగబడులు చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు రానుండటంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. రాగల రెండు రోజుల్లో తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. ఆది, సోమ వారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఓ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడొచ్చని వాతావరణ సంచాలకులు పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
మధ్య అరేబియా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం తెలంగాణపై అధికంగా ఉంటుందని, ఆంధ్రప్రదేశ్ లోనని గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. లాక్డౌన్ కారణంగా రైతులు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చేతికొచ్చిన పసుపు, మిర్చి, తదితర పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు దిగాలు చెందున్నారు.