యాక్టివ్‌ రోల్‌లోకి కొండా దంపతులు! ఏం చేస్తారు?

కొండా కపూల్స్‌ ఒకప్పుడు ఉమ్మడి స్టేట్‌లో రాజకీయాల్లో వెలుగు వెలిగిన లీడర్స్‌. ఓరుగల్లు కోట సాక్షిగా తిరుగులేని రాజకీయ నేతలుగా ముద్రపడిన వారు. మంత్రి హోదాలను అనుభవించిన వారు. కానీ.. టైం బ్యాడ్‌. ఏ స్థాయిలో వెలుగు వెలిగారో ఇప్పుడు వారి రాజకీయ జీవితం అంత చీకట్లో పడిపోయే పరిస్థితి వచ్చింది. వాటి నుంచి బయటపడేందుకు ఇప్పుడు మళ్లీ మరో టర్న్‌ తీసుకోబుతున్నారట. Also Read: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: కీలక ట్విస్ట్ ఇదే! కొండా సురేఖ దంపతులంటే […]

Written By: NARESH, Updated On : October 27, 2020 2:58 pm
Follow us on


కొండా కపూల్స్‌ ఒకప్పుడు ఉమ్మడి స్టేట్‌లో రాజకీయాల్లో వెలుగు వెలిగిన లీడర్స్‌. ఓరుగల్లు కోట సాక్షిగా తిరుగులేని రాజకీయ నేతలుగా ముద్రపడిన వారు. మంత్రి హోదాలను అనుభవించిన వారు. కానీ.. టైం బ్యాడ్‌. ఏ స్థాయిలో వెలుగు వెలిగారో ఇప్పుడు వారి రాజకీయ జీవితం అంత చీకట్లో పడిపోయే పరిస్థితి వచ్చింది. వాటి నుంచి బయటపడేందుకు ఇప్పుడు మళ్లీ మరో టర్న్‌ తీసుకోబుతున్నారట.

Also Read: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: కీలక ట్విస్ట్ ఇదే!

కొండా సురేఖ దంపతులంటే ఇరు రాష్ట్రాల్లోనూ తెలియనివారుండరు. తూటాల్లాంటి మాటలు.. మంటల దారిని తలపించే వారి బాట యమ క్రేజ్‌. చాలా రోజులుగా సైలెంట్‌ అయిపోయిన ఈ దంపతులు మళ్లీ యాక్టివ్‌ రోల్‌లోకి వచ్చేందుకు రెడీ అయిపోతున్నారట. తెలంగాణ రాజకీయాల్లో ఓరుగల్లు జిల్లాది ఓ ప్రత్యేక స్థానం. అందులో కొండా సురేఖ దంపతుల ప్రస్థానం మరింత ప్రత్యేకం. కాంగ్రెస్ పార్టీ, అందునా వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో వారిది స్వర్ణ యుగం. జిల్లాలో వీరు చెప్పిందే వేదం. వీరు చేసిందే శాసనం.

వైఎస్సార్‌‌ మరణానంతరం ఆయన మీద ఉన్న అభిమానంతో ముందుగానే రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఆ తర్వాత మారిన రాజకీయాలకు అనుగుణంగా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గం మారి మరీ సత్తా చాటారు. గులాబీ పార్టీలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2018 ఎన్నికల్లో, ఫస్ట్ ఫేజ్‌లో టికెట్ ఇవ్వలేదు. సీఎం నేరుగా వీరితో చర్చించి బీఫాం ఇద్దామని భావిస్తున్న తరుణంలోనే, ఘర్‌ వాపసీ అంటూ కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. గులాబీ దండుపై విమర్శల జడివాన కురిపించారు. కాంగ్రెస్‌ తరపున పరకాలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి నిశ్శబ్దంలో ఉన్నారు. ఇప్పుడు ఈ నిశ్శబ్దాన్ని ఛేదించి, రీయాక్టివ్‌ అయ్యారు కొండా కపుల్స్.

Also Read: పోలవరం: టీడీపీ, వైసీపీతో కేంద్రం ఆట!

తాజాగా.. అధికార పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్‌‌ను కాంగ్రెస్‌లోకి లాగి తమ ఆధిపత్యాన్ని చాటారు. గులాబీ దళానికి సవాల్ విసిరారు. అంతేకాదు వరంగల్ తూర్పు స్థానం నుంచి, బరిలోకి దిగేది తానేనని తేల్చిచెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం, బీసీ లీడర్‌ను మేయర్ చేస్తామని శపథం చేయడంతో వరంగల్‌లో రాజకీయ వేడి రగులుకుంది. కార్పొరేషన్ ఎన్నికలను కొండా దంపతులు ఎందుకింతగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్న దానిపై రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. గతంలో కొండా కపుల్స్‌కు అడ్డాగా ఉన్న పరకాల నియోజకవర్గాన్ని వీడి, వరంగల్ తూర్పు వైపు వారి మనసు మళ్లుతోందట. అందుకే తూర్పు నియోజకవర్గంలో సెల్ఫీలతో సందడి చేస్తున్నారట. 24 గంటలు తమ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని ప్రకటించారట. త్వరలో రాబోతున్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ దమ్ము చూపిస్తామని చెబుతున్నారు. అంతేకాదు.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 23 డివిజన్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు  కొండా కపుల్. మొత్తానికి ఇన్నాళ్లు సైలెంట్‌ అయిపోయిన ఈ దంపతులు ఇప్పుడు ఒక్కసారిగా నిద్ర లేవడంతో అటు పార్టీలోనూ.. ఇటు అభిమానుల్లో ఉత్సాహం కనిపించింది.