Homeఅంతర్జాతీయంAfghanistan: జాతినుద్దేశించి అమెరికా అధ్యక్షుడు.. అప్ఘన్ పై సంచలన ప్రకటన

Afghanistan: జాతినుద్దేశించి అమెరికా అధ్యక్షుడు.. అప్ఘన్ పై సంచలన ప్రకటన

Joe Biden on afghanistanAfghanistan: అమెరికా (America)తన బలగాలను అఫ్గనిస్తాన్ నుంచి ఉపసంహరించుకోవడంపై అధ్యక్షుడు బైడెన్ (President Joe Biden) ప్రసంగించారు. అఫ్గాన్ సంక్షోభ (Afghanistan Crisis) పరిస్థితుల నేపథ్యంలోనే దేశం నుంచి విడిచిపోవాల్సి వచ్చిందని చెప్పారు. దాదాపు 20 సంవత్సరాల పాటు అఫ్గాన్ లో పరిపాలన చేసినా ఇక ప్రస్తుతం సాధ్యం కాలేదని తెలుస్తోంది. అందుకే దేశం విడిచి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. దీనిపై ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా నిరసనలు చెలరేగినా చేయక తప్పలేదు. అమెరికా సేనలు దేశం విడిచి వెళ్లిపోవడంతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. అరాచక పాలన సాగిస్తున్నారు. అడ్డం వచ్చిన వారిని అంతమొందిస్తున్నారు. అమెరికా సేనలు వెనక్కి తగ్గడంతో తాలిబన్లు తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు.

అఫ్గానిస్తాన్ సంక్షోభానికి అమెరికాయే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్షుడు జో బైడెన్ తన బలగాలను వెనక్కి పిలిపించుకోవడంతోనే నిరసనలు నింగినంటుతున్నాయి. అఫ్గాన్ పరిస్థితిపై బ్రిటన్ సైతం విమర్శలు చేసింది. ఆగస్టు 31 నాటికి తన బలగాలను వెనక్కి పిలిపిస్తామని చెప్పినా అంతకన్నా ముందే తన మాట నిలబెట్టుకుంది. 17 రోజుల్లోనే బలగాల తరలింపు ప్రక్రియ పూర్తి చేసి తానేమిటో నిరూపించుకుంది.

అమెరికా సైనిక బలగాల ఉపసంహరణను సమర్థించుకుంది. మరో ప్రత్యామ్నాయంలేకనే సైన్యాన్ని వెనక్కి పిలిపించినట్లు పేర్కొంది. ఇది అత్యుత్తమ నిర్ణయంగా వెల్లడించింది. అఫ్గాన్ లో తమ సైన్యం మోహరించడం వల్ల రోజుకు 300 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఇంత ఖర్చును ఇన్ని సంవత్సరాల పాటు భరించినందుకు ఎంతో నష్టపోవాల్సి వచ్చిందని చెప్పింది. దాదాపు 1.20 లక్షల అమెరికా పౌరులు, అఫ్గనిస్తానీయులు, ఇతర దేశాల వారిని తరలించారు. దీంతో అమెరికాకు విపరీతంగా ఖర్చయిందని చెబుతున్నారు.

యుద్ధం నిరంతరం కొనసాగదని ఎక్కడో ఒక చోట ముగింపు ఉంటుంది. అందుకే అఫ్గన్ నుంచి తన బలగాలను వెనక్కి రప్పించినట్లు బైడెన్ చెప్పారు. తాలిబన్ల ఆక్రమణ మొదలైన తరువాత అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోవడంతో పెద్ద తప్పు చేశారు. దీంతోనే దేశంలో అల్లర్లు చెలరేగాయని తలుస్తోంది. అరాచకత్వం కూడా నిలువెత్తు లేచిందని సమాచారం. తాలిబన్ల బలం క్రమంగా పెరగడంతో వారి అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే దేశం మొత్తం తాలిబన్ల కబంధ హస్తాల్లోకి వెళ్లింది.

అఫ్గాన్ పరిణామాలతో అమెరికా కూడా నష్టపోయింది. 20 సంవత్సరాల పాటు పరాయి దేశంలో ఉండి సేవలందించడం మామూలు విషయం కాదు. దేశంలో సైనిక బలగాల సేవలకు మిలియన్ల కొద్దీ ఖర్చు చేసి తీవ్ర నష్టాలను మిగిల్చుకుంది. దీంతోనే అమెరికా తన బలగాలను వెనక్కి పిలిపించుకుని చేసిన తప్పును సరిదిద్దుకుంది. దీంతో అఫ్గాన్ శకం ముగిసట్లే అని బైడెన్ ఉద్విగ్న భరితంగా మాట్లాడారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version