The Pawan Kalyan moved on Varahi: విజయవాడలోని అన్ని దారులు ఇప్పుడు మచిలీపట్నం వైపు దారితీస్తున్నాయి. మచిలీపట్టణంలో జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. సభాస్థలికి చేరుకునేందుకు పవన్ కల్యాణ్ బయల్దేరారు. అడుగడుగునా ఆయనకు ప్రజానీకం స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపిస్తున్నారు. రోడ్లన్నీ స్థంభించిపోయాయి. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
సోమవారమే ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్న ఆయన, ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై అగ్ర నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ రోజు మచిలీపట్టణంలో సభ జరగనుంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్, పవన్ కల్యాణ్ రూట్ మ్యాప్ ను పార్టీ కార్యాలయం ముందుగానే విడుదల చేసింది. పోలీసుల ఆంక్షలు విధించి అడ్డుకోనున్నట్లు పుకార్లు వినిపించాయి.
ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, జనసైనికులు మాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపించలేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ మచిలీపట్నం యాత్ర దృశ్యమాలికను కింద చూడొచ్చు..

వారాహిపై కదిలిన ‘‘పవనుడు’’.. జనసంద్రమైన జనసేనాని ర్యాలీ