spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Janasena: విశాఖ స్టీల్ ప్లాంట్ అస్ర్తంగా జనసేన డిజిటల్ యుద్ధం

Janasena: విశాఖ స్టీల్ ప్లాంట్ అస్ర్తంగా జనసేన డిజిటల్ యుద్ధం

Janasena:  విశాఖ స్టీల్ ప్లాంట్ ను జనసేన అస్ర్తంగా చేసుకుంటోంది. దీనిపై పోరాడేందుకు నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా రాజకీయంగా తేల్చుకోవాలని బావిస్తోంది. దీనికి గాను వైసీపీని టార్గెట్ చేసుకుంటోంది. పార్లమెంట్ వేదికగా కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నిస్తోంది. దీనికి ఈనెల 18 నుంచి 20 వరకు వైసీపీ, టీడీపీ ఎంపీలను లక్ష్యంగా చేసుకుని ప్రశ్నిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎందుకు స్పందించడం లేదని అడుగుతోంది.

Janasena
Janasena Pawan Kalyan

పార్లమెంట్లో ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తున్నారు. 22 మంది ఎంపీలున్నా కేంద్రం వైఖరిని ఎందుకు అడగటం లేదని అనుమానిస్తున్నారు. ఎంపీలు ఎందుకు నోరు మెదపడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంపీలు కనీసం ప్లకార్డులు కూడా ప్రదర్శించడం లేదు. విశాఖ స్టీల్ పై కనీసం సభనైనా స్తంభింపచేసే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. దీంతో పవన్ కల్యాణ్ వారిపై కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై డిజిటల్ యుద్ధం చేసింది. రోడ్ల అధ్వాన స్థితిని ఎండగట్టేందుకు నిర్ణయించుకుని శ్రమదానం చేసి మరీ రోడ్లు బాగు చేసింది. అదే కోవలో ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా తమదైన శైలిలో ముందుకు తెచ్చి దానిపై కూడా ఎంపీలు స్పందించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు విశాఖ స్టీల్ అంశంలో కూడా డిజిటల్ యుద్ధం చేసేందుకు నిర్ణయించుకుంది.

Also Read: Nara Lokesh: ఇంకెప్పుడు నేర్చుకుంటావ్ ‘పప్పు’.. మీ తండ్రిని చూసైనా మారవా?

విశాఖ స్టీల్ ప్లాంట్ పై జనసేన పోరాడేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. పార్టీల్లో చలనం తీసుకొచ్చే విధంగా వారిని మార్చేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంట్ వేదికగా ఎంపీలు తమ గళం వినిపించేలా ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సూచిస్తోంది. ఎంపీలు స్పందించి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు మార్గం కనుగొనాలని భావిస్తోంది.

Also Read: Jagan Sarkar: ఒక్క స‌ర్క్యుల‌ర్‌తో థియేట‌ర్ల ఓన‌ర్ల‌కు షాక్ ఇచ్చేసిన జ‌గ‌న్ స‌ర్కార్‌..!

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version