Homeఆంధ్రప్రదేశ్‌సంచలనం: కేసు నుంచి తప్పించాలని కోర్టులో జగన్ పిటీషన్

సంచలనం: కేసు నుంచి తప్పించాలని కోర్టులో జగన్ పిటీషన్

అక్రమాస్తులంటూ ఆరోపిస్తూ ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదు చేసిన కేసులు ఒక్కొక్కటిగా విచారణకు వస్తున్నాయి. సీఎం కాకముందు రెగ్యులర్‌‌గా జగన్‌ సీబీఐ కోర్టుకు హాజరయ్యే వారు. సీఎం అయ్యాక తనకు మినహాయింపులు ఇవ్వాలంటూ కోరారు. కొద్ది రోజుల పాటు మినహాయింపులు ఇచ్చినా ఆ తర్వాత హాజరు కావాల్సిందేనంటూ కోర్టు ఆదేశాలిచ్చింది.

Also Read: హాట్ టాపిక్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు ఎప్పుడు?

అయితే.. తాజాగా తనను జగతి కేసు నుంచి తప్పించాలంటూ జగన్‌ మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టును కోరారు. సీబీఐ తనపై ఏ విధమైన క్రిమినల్‌ అభియోగాలు మోపలేదని ఆయన గుర్తు చేస్తూ తనను ఈ కేసు నుంచి తప్పించాలని కోరారు.

జగన్‌ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కోర్టులో వాదనలు జరిగాయి. సీబీఐ దాఖలు చేసిన 11, ఈడీ దాఖలు చేసిన 5 చార్జిషీట్లపై సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీఆర్‌‌ మధుసూదన్‌రావు విచారించారు. జగతి పెట్టుబడులు, వాన్‌ పిక్‌, రాంకీ, పెన్నా సిమెంట్స్‌, రఘురాం సిమెంట్స్‌ వంటి కీలక కేసులు విచారణకు వచ్చాయి.

Also Read: పేదల కోసం సోము వీర్రాజు ఓ మంచి నిర్ణయం

అయితే.. ఈ కేసుల నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్‌ డిశ్చార్జి పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై సీనియర్‌‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదించారు. కంపెనీల చట్టాన్ని దర్యాప్తు అధికారి తప్పుగా పేర్కొన్నారని ఆయన చెప్పారు. కంపెనీల చట్టంలోని ఏ నిబంధనను ఉల్లంఘించారనే విషయాన్ని ఎక్కడా పొందుపరచలేదని ఆయన వెల్లడించారు. ఈ విచారణ న్యాయమూర్తి వాయిదా వేయగా.. రాంకీ కేసులో వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి మరో డిశ్చార్జి పిటిషన్‌ వేశారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

Exit mobile version