Homeఆంధ్రప్రదేశ్‌తిరుపతి ఉప ఎన్నికపై జగన్ మాస్టర్ స్ట్రోక్..!

తిరుపతి ఉప ఎన్నికపై జగన్ మాస్టర్ స్ట్రోక్..!

ఓ వైపు రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు ముగియడంతో.. ఇక ప్రధాన పార్టీలన్నీ తిరుపతిపై ఫోకస్‌ పెట్టాయి. ఇక వైసీపీ, టీడీపీ జనసేన–-బీజేపీలు కూడా పోటీపై ఓ క్లారిటీకి వచ్చేశాయి. పవన్‌తో చర్చించి బీజేపీ నుంచి అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటన విడుదలైంది. దీంతో కమలం పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే చర్చ జరుగుతోంది

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న వైసీపీ అధినేత జగన్ కూడా ఇక తిరుపతి ఉప ఎన్నికపై దృష్టి సారించారు.ఈ  నేపథ్యంలో ఆయన మంగళవారం తిరుపతికి బయలుదేరనున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టల్లాగా.. అటు దేవాలయాలపై ప్రభుత్వం దాడులు చేయిస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా.. ఇటు తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు జగన్ తిరుపతి పయనమైనట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి తిరుపతిలో బస చేసి, బుధవారం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఆయన ఈ సమయంలో తిరుపతి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుందని ఫ్యాన్ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.

2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ తరువాత రెండేళ్లకు జరిగిన పంచాయతీ ఎన్నికలు బరిలోకి దిగింది. అయితే ప్రతిపక్షాల ప్రభుత్వంపై విమర్శలు, అటు ఎలక్షన్ కమిషన్ తో కోల్డ్ వార్ జరిగిన నేపథ్యంలో వైసీపీని ప్రజలు ఆదరిస్తారా..? లేదా..? అన్న సందేహం సొంత పార్టీ నాయకుల్లోనే కలిగింది. వీటన్నింటిన ఆసరాగా చేసుకున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారని ప్రచారం చేశారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిప్పికొడతారని అనుకున్నారు.

అటు దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ, జనసేనలు ఆందోళనలు కొనసాగించాయి. ప్రభుత్వం కావాలనే ఆలయాలపై దాడులు చేయిస్తుందని ప్రచారం చేశాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఏ విధంగా స్పందించకుండా దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతూ వచ్చింది. ఈ ప్రభావం పంచాయతీ ఎన్నిలపై చూపుతుందని బీజేపీ, జనసేనలు భావించాయి.

కానీ జగన్ పై ఉన్న నమ్మకాన్ని ఏపీ ప్రజలు మరోసారి చూపించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ మెజారిటీ ఇచ్చేశారు. దీంతో ప్రజలు వైసీపీతోనే ఉన్నట్లు చెప్పేశారు. ఈ నేపథ్యంలో జగర్ ఈరోజు తిరుపతి పర్యటనకు వెళ్లి అక్కడి ఉప ఎన్నికలో విజయం సాధించేలా కార్యాచరణ ప్రారంభించనున్నారు. కేవలం గెలుపు కోసమే కాకుండా మెజారిటీ విషయంపై కూడా దృష్టి సారించనున్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తుందని చెప్పేలా వ్యూహం పన్ననున్నారు.

ఇక తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థిపై ఆసక్తి నెలకొంది.ఈ రేసులో ప్రధానంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. ముగ్గురు రిటైర్ అధికారులు, మరో స్థానిక నేత అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆ నలుగురిలో రిటైర్డు ఐఏఎస్‌ అధికారులు దాసరి శ్రీనివాసులు, రత్నప్రభ, రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్‌ ఉన్నారు. ఇక తిరుపతి బీజేపీ నేత ముని సుబ్రమణ్యం పేరు కూడా తెరపైకి వచ్చింది. వీరిలో దాసరి శ్రీనివాసులు, రత్నప్రభ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. గతంలో కూడా తిరుపతి నుంచి విద్యావంతులకు అవకాశం ఇస్తున్నారు.

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper
Exit mobile version