మరో కొత్త స్కీం అమల్లోకి తెస్తున్న జగన్‌

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత బాగోలేకున్నా పథకాలు అమలు చేయడంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. అంతేకాదు.. నెలకో కొత్త స్కీంలను ప్రవేశపెడుతూ మరింత ప్రజాదరణ పొందుతున్నారు. ఓ వైపు.. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఎక్కడా భయపడకుండా ముందుకు సాగుతున్నారు. అసలు ఈ పథకాల అమలుకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని అందరూ అనుకునేలా తన పని తాను చేసుకుపోతున్నారు. తాజాగా.. మరో సరికొత్త పథకాన్ని తెరమీదకు తెచ్చారు. Also […]

Written By: Srinivas, Updated On : December 21, 2020 1:41 pm
Follow us on


రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత బాగోలేకున్నా పథకాలు అమలు చేయడంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. అంతేకాదు.. నెలకో కొత్త స్కీంలను ప్రవేశపెడుతూ మరింత ప్రజాదరణ పొందుతున్నారు. ఓ వైపు.. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఎక్కడా భయపడకుండా ముందుకు సాగుతున్నారు. అసలు ఈ పథకాల అమలుకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని అందరూ అనుకునేలా తన పని తాను చేసుకుపోతున్నారు. తాజాగా.. మరో సరికొత్త పథకాన్ని తెరమీదకు తెచ్చారు.

Also Read: జగన్‌, బాబులకు బీజేపీ చెక్‌ పెట్టబోతోందా..?

వందేళ్ల తర్వాత ఏపీలో సమగ్ర భూముల సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. దీంతో మరో అధ్యాయానికి తెర లేపినట్లైంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం కింద సర్వే ఆఫ్ ఇండియాతో కలిపి ఈ ప్రాజెక్టును చేస్తున్నారు. ఇందుకోసం సదరు సంస్థతో అవగాహన ఒప్పందం కూడా చేసుకోవటం గమనార్హం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం.. తక్కెళ్లపాడు వద్ద ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా ఏం చేస్తారు..? ఎన్ని దశల్లో చేస్తారు..? దీనికి అయ్యే ఖర్చు ఎంత..?దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి..? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలెన్నో బయటకు వస్తాయి.

Also Read: అలుపెరగని పోరాట యోధుడు ‘జగన్’

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4500 టీంలు ఈ పథకంలో భాగంగా పని చేయనున్నాయి. తొలిదశ సర్వే వచ్చే ఏడాది జులై వరకు.. రెండో దశ సర్వే వచ్చే ఏడాది అక్టోబరు వరకు సాగుతుంది. చివరిదైన మూడో దశ సర్వే జులై 2022 నుంచి 2023 వరకు సాగుతుంది.ఈ పథకంలో భాగంగా ఏపీ వ్యాప్తంగా ఉన్న 17 వేల గ్రామాల్లోని 2.26 కోట్ల ఎకరాల భూమిని.. 13,371 గ్రామ కంఠాల్లోని 85 లక్షల ప్రభుత్వ.. ప్రైవేటు ఆస్తులు.. 110 పట్టణ ప్రాంతాల్లో 40 లక్షల ప్రభుత్వ.. ప్రైవేటు ఆస్తులతో పాటు 10 లక్షల ప్లాట్లలోనూ ఈ సర్వే నిర్వహించనున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఇందులో భాగంగా ఏం చేయబోతున్నారనే విషయానికి వస్తే గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శి.. సర్వేయర్లతో కూడిన టీంలు సర్వే నిర్వహిస్తాయి. డ్రోన్. కార్స్.. రోవర్ లాంటి పరికరాలతో ప్రతి స్థిరాస్తిని భూ అక్షాంశ రేఖాంశాలతో సర్వే రిపోర్టులను తయారు చేస్తారు. ప్రతీ యజమానికి ఆ వివరాలను నోటీసు ద్వారా తెలియజేస్తారు. ఏదైనా అభ్యంతరం ఉంటే గ్రామసచివాలయంలో అప్పీలు చేసుకోవల్సి ఉంటుంది. అవి సత్వరం పరిష్కారమయ్యేలా మొబైల్ మెజిస్ట్రేట్ టీంలు ఏర్పాటు చేస్తున్నారు. సర్వే తర్వాత ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు పత్రాన్ని అందజేయనున్నారు. ఈ మొత్తం పథకం కోసం రూ.వెయ్యి కోట్లను జగన్ ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఇక ఏపీలో కూడా భూ కొట్లాటలు లేకుండా సర్వే ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన పత్రాలు అందనున్నట్లు అర్థమవుతోంది.