సంగం డెయిరీపై జగన్ సర్కార్ దాడి అందుకోసమేనా?

ఏపీ సీఎం జగన్ టార్గెట్ సుస్పష్టం. ఆయన ఏం చేయదలుచుకుంటున్నారో అది చేసేస్తున్నారు. ప్రధానంగా టీడీపీ ఆయువు పట్టు అయిన ఆదాయ మార్గాలపై కొడుతున్నారు. చావు దెబ్బ తీస్తున్నారు. అమరావతి నుంచి టీడీపీకి వెన్నుముకగా ఉన్న చంద్రబాబు సన్నిహితుల వ్యాపారాలపై దెబ్బ కొడుతున్నారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే సుజనా చౌదరి, సీఎం రమేశ్ లపై జగన్ అధికారంలోకి రాగానే వ్యూహాత్మక దాడులు జరిగాయన్న ప్రచారం ఉంది. ఇప్పుడు అదే పంథా కొనసాగుతోందంటున్నారు. అమరావతి రాజధాని టీడీపీకి, […]

Written By: NARESH, Updated On : April 24, 2021 8:55 am
Follow us on

ఏపీ సీఎం జగన్ టార్గెట్ సుస్పష్టం. ఆయన ఏం చేయదలుచుకుంటున్నారో అది చేసేస్తున్నారు. ప్రధానంగా టీడీపీ ఆయువు పట్టు అయిన ఆదాయ మార్గాలపై కొడుతున్నారు. చావు దెబ్బ తీస్తున్నారు. అమరావతి నుంచి టీడీపీకి వెన్నుముకగా ఉన్న చంద్రబాబు సన్నిహితుల వ్యాపారాలపై దెబ్బ కొడుతున్నారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది.

ఇప్పటికే సుజనా చౌదరి, సీఎం రమేశ్ లపై జగన్ అధికారంలోకి రాగానే వ్యూహాత్మక దాడులు జరిగాయన్న ప్రచారం ఉంది. ఇప్పుడు అదే పంథా కొనసాగుతోందంటున్నారు.

అమరావతి రాజధాని టీడీపీకి, ఆ పార్టీ నేతలు, సానుభూతిపరులకు ఒక గొప్ప ఆస్తిగా ఉండేది. కానీ రాజధానిని విశాఖకు మార్చిన జగన్ ఇప్పుడు అమరావతి రియల్ భూమ్ ను కుప్పకూల్చి టీడీపీకి గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ నేతల ఆయువు పట్టు అయిన వారి వ్యాపారాలపై దెబ్బకొడుతున్నారన్న ప్రచారం ఉంది.

తాజాగా గుంటూరు జిల్లా పాడిరైతులకు కీలకంగా ఉన్న సంగం డెయిరీపై జగన్ సర్కార్ దాడి చేసింది. సంగం డెయిరీని రైతులు ఎంతో ఎత్తుకు చేర్చారు. 10 ఏళ్ల క్రితం రూ.250 కోట్ల టర్నోవర్ ఉండే ఈ డెయిరీ నేనుడు రూ.1100 కోట్ల టర్నోవర్ కు చేరింది. రైతులు సంగం డెయిరీకే పాలు పోస్తారు.

అయితే ఇన్ని వందల కోట్ల డెయిరీపై జగన్ సర్కార్ నజర్ పెట్టింది. అందులోని అక్రమాలను వెలికితీసింది. అంతేకాదు.. ఏపీ సర్కార్ ఇప్పటికే ప్రఖ్యాత అమూల్ సంస్థతో టై అప్ అయ్యింది. ఏపీ పాడి రైతులకు అమూల్ ద్వారా మంచి ధరను ఇప్పించి వారిని ఆర్థికంగా పరిపుష్టి చేస్తోంది. అందుకే టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్ గా ఉండి.. ఆయన వర్గానికే పోతున్న సంగం డెయిరీ లాభాలపై నజర్ పెట్టిన జగన్ సర్కార్ అందులోని లూప్ హోల్స్ వెలికి తీసి దాడి చేసినట్టు తెలిసింది. ధూళిపాళ్లను అరెస్ట్ చేసి సంగం డెయిరీని నిర్వీర్యం చేసి అమూల్ కు పాలు పోసేలా చేసేందుకు ఇలా జగన్ చేసినట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.