ఆ విషయంలో ట్రంప్ ను మోదీ ఫాలోవుతున్నారా?

చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. అగ్ర రాజ్యలను సైతం కరోనా మహమ్మరి గడగడలాడిస్తోంది. ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికాలోనే కరోనా కట్టడి కావడం లేదు. కరోనా కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండటం చూస్తుంటే మిగతా దేశాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో కరోనా కేసులు పెరిగిపోవడానికి అమెరికా స్వయంకృతాపరాధమనే విమర్శలున్నాయి. ఈ మహమ్మరిపై డబ్యూహెచ్ఓ చేసిన హెచ్చరికలను అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తొలినాళ్లలో పెడచెవినపెట్టడమే కేసుల సంఖ్య పెరగగానికి కారణమని […]

Written By: Neelambaram, Updated On : June 18, 2020 4:10 pm
Follow us on


చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. అగ్ర రాజ్యలను సైతం కరోనా మహమ్మరి గడగడలాడిస్తోంది. ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికాలోనే కరోనా కట్టడి కావడం లేదు. కరోనా కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండటం చూస్తుంటే మిగతా దేశాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో కరోనా కేసులు పెరిగిపోవడానికి అమెరికా స్వయంకృతాపరాధమనే విమర్శలున్నాయి. ఈ మహమ్మరిపై డబ్యూహెచ్ఓ చేసిన హెచ్చరికలను అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తొలినాళ్లలో పెడచెవినపెట్టడమే కేసుల సంఖ్య పెరగగానికి కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ట్రంప్ మెల్కోన్నప్పటికీ అప్పటికే అమెరికాకు జరగరాని నష్టం జరిగిపోయిందనే వాదనలున్నాయి.

కరోనా విషయంలో భారత ప్రధాని మోదీ ముందుగానే మెల్కోని దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితయ్యారు. లాక్డౌన్ పది నుంచి పదేహను రోజుల్లో ముగిస్తుందని అందరూ భావించారు. లాక్డౌన్ వల్ల వైరస్ ను భారత్ కొంతమేర మాత్రమే కట్టడి చేయగలిగింది తప్ప పూర్తిస్థాయిలో నివారించలేకపోయింది. దీంతో కేంద్రం లాక్డౌన్ పొడగిస్తూ పోయింది. ప్రస్తుతం లాక్డౌన్ 5.0 కొనసాగుతోంది. జూన్ 30వరకు లాక్డౌన్ 5.0కొనసాగనుంది.

ఇదిలా ఉంటే లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు, అన్నివర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ప్రజారవాణా పూర్తిగా స్తంభించిపోవడంతో ఎక్కడివారే అక్కడే ఉండాల్సి వచ్చింది. అయితే లాక్డౌన్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాబడి తగ్గింది. దీంతో ఆదాయం పెంచుకునేందుకు లాక్డౌన్ 3.0, 4.0లో కేంద్రం ఆయా రాష్ట్రాలకు కొన్ని షరతులతో భారీ సడలింపులను ఇచ్చింది. ఈనేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు, కేంద్రానికి తిరిగి ఆదాయం సమకూరుతోంది.

లాక్డౌన్లో భారీ సడలింపులు ఇవ్వడంతో గడిచిన నెలరోజులుగా దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో మళ్లీ లాక్డౌన్ ఉంటుందనే ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలో ప్రధాని మోదీ తాజాగా సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్డౌన్ పై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ మరోసారి లాక్డౌన్ విధించే అవకాశం లేదని స్పష్టం చేశారు. అన్ లాక్-2.0పైనే కేంద్రం దృష్టిసారించిందని పేర్కొనడం గమనార్హం.

ఓవైపు దేశంలో కేసులు సంఖ్యతోపాటు మరణాల సంఖ్య పెరిగిపోతుంది. అయితే దీనిని ప్రధాని మోదీ అంతగా పట్టించుకున్నట్లు కన్పించడం లేదు. మరోవైపు కరోనాతో కలిసి జీవించడం అలవర్చుకోవాలని కేంద్రం, ఆయా రాష్ట్రాలు సూచిస్తుండటం పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్యల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్న కేసులతో భారత్ మరింత ప్రమాద స్థితికి చేరేలా కన్పిస్తుంది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ ఆన్ లాక్-2.0పైనే ఫోకస్ పెట్టడం చూస్తుంటే మోదీ కూడా ట్రంప్ బాటలోనే నడుస్తున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ట్రంప్ నిర్లక్ష్యం కారణంగా అమెరికా ప్రజలు కరోనా బారినపడి పెద్దసంఖ్యలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందనే విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే కరోనాపై ప్రధాని మోదీ ముందుగానే మెల్కోన్నప్పటికీ వైరస్ కట్టడిలో విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనే వాదనలు విన్పిస్తున్నాయి. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు చూస్తుంటే ప్రధాని మోదీ కరోనాపై పూర్తిగా చేతులేత్తిసినట్లే కన్పిస్తుంది. ఈనేపథ్యంలో ప్రజలు ప్రభుత్వాలను నమ్ముకోకుండా తమకుతాము జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.