spot_img
Homeజాతీయ వార్తలుIndigo - Mumbai airport : రన్‌వేపై భోజనం : ఇండిగోకు రూ.1.20 కోట్లు, ముంబై...

Indigo – Mumbai airport : రన్‌వేపై భోజనం : ఇండిగోకు రూ.1.20 కోట్లు, ముంబై ఎయిర్‌ పోర్టుకు రూ.90 లక్షల జరిమానా!

Indigo – Mumbai airport : ముంబై విమానాశ్రయంలో ప్రయాణికులు భోజనం చేసిన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ కొరడా ఝళిపించింది. ఇందుకు బాధ్యులైన ఇండిగో సంస్థకు రూ.1.20 కోట్లు, ముంబై విమానాశ్రయ నిర్వహణ సంస్థకు రూ.90 లక్షల జరిమానా విధించింది. రన్‌వేపై ప్రయాణికులు ఆహారం తినే వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ చర్యలకు దిగింది. వీటితోపాటు ఎయిర్‌ ఇండియా, స్సైస్‌ జెట్‌ సంస్థలకు కూడా జరిమానా విధించింది.

విమానం ఆసల్యంపై నిరసన..
పొగమంచు కారణంగా నాలుగు రోజుల క్రితం ముంబై విమానాశ్రయంలో విమానాలు ఆలస్యంగా నడిచాయి. వీటిని ఎయిర్‌లైన్స్‌ అధికారులు క్రమబద్ధీకరించేందుకు యత్నిస్తుండగా, ఇండిగో ప్రయాణికులు ముంబై విమానాశ్రయంలో హడావుడిగా బయటకు వచ్చి రన్‌వేపై కూర్చుని నిరసన తెలిపారు. అక్కడే ఆహారం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

భద్రత విషయంలో నిర్లక్ష్యం..
విమానాలతోపాటు, విమానాశ్రయ భద్రతకు ముప్పుగా పరిణమించే ఈ ఘటనను అడ్డుకోవడంతో ఇటు ఇండిగో సంస్థ గానీ, అటు మిమానాశ్రయ నిర్వహణ సంస్థ గానీ చురుగ్గా వ్యవహరించలేదని విమానయాన మంత్రిత్వ శాఖ భావించింది. ఈమేరకు రెండింటికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు వివరణ ఇచ్చిన ఇండిగో ఘటనపై అంతర్గత విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. దీనికి సంతృప్తి చెందని విమానయాన శాఖ నిర్లక్ష్యానికి రూ.1.20 కోట్ల జరిమానా విధించింది. అదే విధంగా ముంబై విమానాశ్రయ నిర్వహణ సంస్థకు కూడా రూ.90 లక్షల ఫైన్‌ వేసింది.

ఏం జరిగిందంటే..
ఇండిగో విమానం 6ఈ2195 ఆదివారం రాత్రి 11.21 గంటలకు పొగ మంచు కారణంగా ముంబై విమానాశ్రయంలోకి రాకుండా మళ్లించారు. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రయాణికులు ఒక్కసారిగా రన్‌వేపైకి వచ్చి నిరసన తెలిపారు. అక్కడే ఆహారం తీసుకున్నారు. విమానానికి కాంటాక్ట్‌ స్టాండ్‌కు బదులుగా రిమోట్‌ బే ఇ–33 కేటాయించారు. ఇది కేటాయించిన బోర్డింగ్‌ గేట్‌ నుండి విమానంలో ప్రయాణించడానికి మరియు తిరిగి రావడానికి అనువుగా ఉండే ఎయిర్‌క్రాఫ్ట్‌ పార్కింగ్‌ స్టాండ్‌. ఇది ప్రయాణీకుల కష్టాలను మరింత పెంచింది. అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. విశ్రాంతి గదులు, రిఫ్రెష్‌మెంట్‌ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవు. దీంతో అసహనానికి గురైన ప్రయాణికులు ఒక్కసారిగా రన్‌వేపైకి వచ్చారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version