spot_img
Homeజాతీయ వార్తలుPetrol Price Hike In India: దేశంలో ఇక పెట్రోల్ ధరలను భరించలేమా? ఏం జరుగుతోంది..

Petrol Price Hike In India: దేశంలో ఇక పెట్రోల్ ధరలను భరించలేమా? ఏం జరుగుతోంది..

Petrol Price Hike In India: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారత ఇంధన ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల సెంబ్లీ ఎన్నికల కరాణంగా దాదాపు రెండు నెలలు ధరలు పెంచకుండా భవించిన కేంద్రం.. ఎన్నికలు ముగియగానే వరుసగా పెట్రో బాదుడు మొదలు పెట్టింది. గడిచిన పది రోజుల్లో మూడుసార్లు ధరలు పెంచి సామాన్యుడిపై తీవ్ర భారం మోపింది. క్రూడాయిల్‌ ఒత్తిడి, యిల్‌ కంపెనీల ఒత్తిడితో మే 15న పెట్రోల్, డీజిల్‌ ధరలపై రూ.3 చొప్పున పెంచింది. మే 19న పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెంచింది. తాజాగా మే 23న మళ్లీ పెట్రోల్‌ లీటర్‌కు 87 పైసలు, డీజిల్‌కు 91 పైసలు, సీఎన్జీ కేజీకి రూ.1 పెరిగాయి.

యుద్ధ ప్రభావమే అంటున్న కంపెనీలు..
ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు దీర్ఘకాలం నష్టాలను భరించాయని చెబుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అధిక ధరలకు క్రూడాయిల్‌ కొనుగోలు చేయడం వల్ల వేల కోట్ల ఆర్థిక నష్టం ఏర్పడిందని వారి వాదన. కేంద్ర ప్రభుత్వం కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచాలనే ఉద్దేశంతో ఎక్సైజ్‌ సుంకాన్ని తాత్కాలికంగా తగ్గించి, ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రయత్నించింది. అయితే ఇప్పుడు ఆ ఒత్తిడి తట్టుకోలేక ధరలు పెంచుతోంది. హర్ముజ్‌ జలసంధి ఉద్రిక్తతలు – సరఫరా గొలుసు ముప్పుఅమెరికా–ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హర్ముజ్‌ జలసంధి వద్ద ఏర్పడిన అనిశ్చితి ప్రపంచ చమురు సరఫరాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ జలసంధి ద్వారా ప్రపంచంలోని గణనీయమైన చమురు రవాణా జరుగుతుంది. దీని వల్ల నౌకా రవాణా ఖర్చులు పెరగడంతోపాటు సరఫరా తగ్గి, ధరలు ఎగిరిపోతున్నాయి.

పెప్పు ఇక్కడితో ఆగదు..
ప్రస్తుత పెంపు ఇక్కడితో ఆగకపోవచ్చని, మరిన్ని దశల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక, మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. కంపెనీలు ఇప్పటి వరకు చేసిన పెంపు సరిపోదని, ఇంకా కొన్ని వారాలు ఈ ప్రక్రియ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. వినియోగదారులపై పడుతున్న భారం ఇంధన ధరల పెరుగుదల సరాసరి ప్రజల జీవన వ్యయాన్ని పెంచుతుంది. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, పండ్లు, పాలు, ఇతర రోజువారీ వస్తువుల ధరలు కూడా ఎగసేత్తే ప్రమాదం ఉంది. ఇప్పటికే ద్రవ్యోల్బణ ఒత్తిడిలో ఉన్న మధ్యతరగతి కుటుంబాలపై ఇది అదనపు భారం. ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి సారించాలి. పునరుత్పాదక ఇంధనాలు, ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రోత్సాహం, విదేశీ చమురు ఆధారితత్వాన్ని తగ్గించే వ్యూహాలు త్వరగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రపంచ రాజకీయాల్లో ఏర్పడే చిన్న చిన్న మార్పులు కూడా భారతీయుల దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ సవాల్‌ను అవకాశంగా మార్చుకుని, ఇంధన స్వావలంబన వైపు వేగంగా అడుగులు వేయడం దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకం. లేని పక్షంలో, ఇలాంటి షాక్‌లు మరిన్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper