Homeజాతీయ వార్తలుSiachen Base Camp Electricity Project: మంచుకొండల్లో.. పాక్ కు కరెంట్ షాక్.. ఇదీ మోడీ...

Siachen Base Camp Electricity Project: మంచుకొండల్లో.. పాక్ కు కరెంట్ షాక్.. ఇదీ మోడీ మార్క్ ట్రీట్మెంట్.. దెబ్బ అదుర్స్ కదూ

Siachen Base Camp Electricity Project: హిమాలయ పర్వతాలు.. ఇప్పటిదాకా పాకిస్తాన్ మన మీద చేసిన దుర్మార్గాలకు ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలిచాయి. పాకిస్తాన్ చేసిన రక్తపాతానికి సజీవ సాక్షంగా కనిపించాయి. అయితే ఇకపై పాకిస్తాన్ మన మీద ఆ స్థాయిలో దూకుడు ప్రదర్శించలేదు. రక్తపాతాన్ని ప్రవహింపజేసే అవకాశం లేదు. ఎందుకంటే భారత్ ఈసారి పాకిస్తాన్ దేశాన్ని కరెంట్ తో కొట్టింది. దిమ్మతిరిగే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది. ఇక దెబ్బకు మన జోలికి పాకిస్తాన్ రాదు.

ఇటీవల పాకిస్తాన్ దేశానికి వెళ్లే నీటి ప్రవాహం విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా పాకిస్తాన్ దేశంలో కీలక ప్రాంతాలు ఎడారిగా మారిపోతున్నాయి. ఇది సరిపోదన్నట్టుగా భారత్ పాకిస్తాన్ దేశానికి దిమ్మతిరిగే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది. మన మీద కయానికి కాలు దువ్వుతూ.. శత్రు దేశాలతో చేతులు కలిపి ఇబ్బంది పడుతూ ఉన్న పాకిస్తాన్ దేశానికి మోడీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఫలితంగా పాకిస్తాన్ దేశం ఇకపై నిశ్శబ్దంగానే కాదు.. అన్ని మూసుకొని కూర్చుంటుంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండే సియాచిన్ బేస్ క్యాంప్ లో విద్యుత్ కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతంలో విద్యుత్ ప్రసారానికి డీజిల్ జనరేటర్లు వాడేవారు. ఇది ప్రభుత్వానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం లాగా ఉండేది. పైగా ఈ ప్రాంతం సముద్రమట్టానికి 12 అడుగుల ఎత్తులో ఉండేది. దీనిని కాపాడుకునేందుకు భారత్ ప్రతి ఏడాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉండేది. ఇక్కడ చలి తీవ్రత అధికంగా ఉంటుంది. విద్యుత్ సరఫరా లేకపోవడం.. కమ్యూనికేషన్లకు అత్యంత అవసరం ఏర్పడడంతో ఇక్కడ డీజిల్ జనరేటర్ల ను ఉపయోగించేవారు. గతంలో సోలార్.. ఇతర స్టోరేజీ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అవి ఆశించినత స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు.

ఇక ఇటీవల కాలంలో ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద ఈ ప్రాంతంలో నేషనల్ కరెంట్ గ్రిడ్ తో అనుసంధాదించాలని భావించారు. మొత్తంగా 1925 కోట్ల ఖర్చుతో ద్రాస్ ప్రాంతం నుంచి పదుం వరకు 189 కిలోమీటర్ల మేర 220 కేవీ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్యాంగ్ ప్రాంతం నుంచి డిస్కెట్ వరకు 79 కిలోమీటర్ల పొడవున 220 కె.వి లైన్ నిర్మిస్తున్నారు. ఈ పనులు మొత్తం సెప్టెంబర్ లోపు పూర్తి కాబోతున్నాయి.

ఇక్కడ విపరీతంగా మంచు ఉంటుంది. గడ్డకట్టుకొని పోయే చలి ఉండటం వల్ల ఇక్కడ విద్యుత్ సరఫరా కు విపరీతంగా అంతరాయం ఏర్పడుతూ ఉండేది. గ్రిడ్ తో దీనిని అనుసంధానించడం వల్ల ఇకపై ఆ ఇబ్బంది ఉండదు. సైనికులకు వసతి కల్పిస్తారు. వేడినీరు కూడా అందిస్తారు. వైద్య సహాయం సకాలంలో కల్పిస్తారు. కమ్యూనికేషన్ వ్యవస్థలను సైతం బలోపేతం చేస్తారు. దీనివల్ల పాకిస్తాన్ దేశాన్ని మరింత ఇబ్బంది పట్టేందుకు మన సైన్యానికి అవకాశం ఏర్పడుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో సైన్యానికి అన్ని విధాలుగా అన్ని వ్యవస్థలు పనిచేసేందుకు కరెంటు తోడ్పడుతుందని అధికారులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...
Oktelugu Epaper
Exit mobile version