Siachen Base Camp Electricity Project: హిమాలయ పర్వతాలు.. ఇప్పటిదాకా పాకిస్తాన్ మన మీద చేసిన దుర్మార్గాలకు ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలిచాయి. పాకిస్తాన్ చేసిన రక్తపాతానికి సజీవ సాక్షంగా కనిపించాయి. అయితే ఇకపై పాకిస్తాన్ మన మీద ఆ స్థాయిలో దూకుడు ప్రదర్శించలేదు. రక్తపాతాన్ని ప్రవహింపజేసే అవకాశం లేదు. ఎందుకంటే భారత్ ఈసారి పాకిస్తాన్ దేశాన్ని కరెంట్ తో కొట్టింది. దిమ్మతిరిగే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది. ఇక దెబ్బకు మన జోలికి పాకిస్తాన్ రాదు.
ఇటీవల పాకిస్తాన్ దేశానికి వెళ్లే నీటి ప్రవాహం విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా పాకిస్తాన్ దేశంలో కీలక ప్రాంతాలు ఎడారిగా మారిపోతున్నాయి. ఇది సరిపోదన్నట్టుగా భారత్ పాకిస్తాన్ దేశానికి దిమ్మతిరిగే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది. మన మీద కయానికి కాలు దువ్వుతూ.. శత్రు దేశాలతో చేతులు కలిపి ఇబ్బంది పడుతూ ఉన్న పాకిస్తాన్ దేశానికి మోడీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఫలితంగా పాకిస్తాన్ దేశం ఇకపై నిశ్శబ్దంగానే కాదు.. అన్ని మూసుకొని కూర్చుంటుంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండే సియాచిన్ బేస్ క్యాంప్ లో విద్యుత్ కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతంలో విద్యుత్ ప్రసారానికి డీజిల్ జనరేటర్లు వాడేవారు. ఇది ప్రభుత్వానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం లాగా ఉండేది. పైగా ఈ ప్రాంతం సముద్రమట్టానికి 12 అడుగుల ఎత్తులో ఉండేది. దీనిని కాపాడుకునేందుకు భారత్ ప్రతి ఏడాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉండేది. ఇక్కడ చలి తీవ్రత అధికంగా ఉంటుంది. విద్యుత్ సరఫరా లేకపోవడం.. కమ్యూనికేషన్లకు అత్యంత అవసరం ఏర్పడడంతో ఇక్కడ డీజిల్ జనరేటర్ల ను ఉపయోగించేవారు. గతంలో సోలార్.. ఇతర స్టోరేజీ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అవి ఆశించినత స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు.
ఇక ఇటీవల కాలంలో ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద ఈ ప్రాంతంలో నేషనల్ కరెంట్ గ్రిడ్ తో అనుసంధాదించాలని భావించారు. మొత్తంగా 1925 కోట్ల ఖర్చుతో ద్రాస్ ప్రాంతం నుంచి పదుం వరకు 189 కిలోమీటర్ల మేర 220 కేవీ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్యాంగ్ ప్రాంతం నుంచి డిస్కెట్ వరకు 79 కిలోమీటర్ల పొడవున 220 కె.వి లైన్ నిర్మిస్తున్నారు. ఈ పనులు మొత్తం సెప్టెంబర్ లోపు పూర్తి కాబోతున్నాయి.
ఇక్కడ విపరీతంగా మంచు ఉంటుంది. గడ్డకట్టుకొని పోయే చలి ఉండటం వల్ల ఇక్కడ విద్యుత్ సరఫరా కు విపరీతంగా అంతరాయం ఏర్పడుతూ ఉండేది. గ్రిడ్ తో దీనిని అనుసంధానించడం వల్ల ఇకపై ఆ ఇబ్బంది ఉండదు. సైనికులకు వసతి కల్పిస్తారు. వేడినీరు కూడా అందిస్తారు. వైద్య సహాయం సకాలంలో కల్పిస్తారు. కమ్యూనికేషన్ వ్యవస్థలను సైతం బలోపేతం చేస్తారు. దీనివల్ల పాకిస్తాన్ దేశాన్ని మరింత ఇబ్బంది పట్టేందుకు మన సైన్యానికి అవకాశం ఏర్పడుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో సైన్యానికి అన్ని విధాలుగా అన్ని వ్యవస్థలు పనిచేసేందుకు కరెంటు తోడ్పడుతుందని అధికారులు అంటున్నారు.
