లక్షణాలు లేవు.. కానీ కరోనా పాజిటివ్!

ఖమ్మం జిల్లాలోని పెద్దతండాలో ఒక వ్యక్తికి కరోనా సోకినా వ్యాధి లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. అతడు కూడా ఢిల్లీలోని మర్కజ్ సమావేశాలకు వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. అతడిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలేవీ అతడికి లేవని తెలిపారు. బాధితుడు టీబీ పేషెంట్‌ కావడంతో వైద్యులు అప్రమత్తంగా ఉండి చికిత్స చేస్తున్నట్లు […]

Written By: Neelambaram, Updated On : April 7, 2020 5:49 pm
Follow us on


ఖమ్మం జిల్లాలోని పెద్దతండాలో ఒక వ్యక్తికి కరోనా సోకినా వ్యాధి లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. అతడు కూడా ఢిల్లీలోని మర్కజ్ సమావేశాలకు వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. అతడిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలేవీ అతడికి లేవని తెలిపారు. బాధితుడు టీబీ పేషెంట్‌ కావడంతో వైద్యులు అప్రమత్తంగా ఉండి చికిత్స చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలోని 29 జిల్లాల్లో మూలాలు కనిపించాయి. కానీ, ఆ జిల్లాలో మాత్రం నిన్నటిదాకా ఒక్క కేసూ నమోదు కాలేదు. కానీ జిల్లాలో తొలి కేసు నమోదైన నేపథ్యంలో మరింత అప్రమత్తమైనట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. ఢిల్లీ మర్కజ్‌ కు వెళ్లొచ్చిన వారిని ఐసోలేషన్‌ లో వైద్య అధికారుల పర్యవేక్షణలో ఉంచామని వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో లాక్‌ డౌన్‌ మరింత పకడ్బంధీగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకూ ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చిన వ్యక్తుల ద్వారానే కరోనా సోకిందని ఆయన వివరించారు. కరోనా కట్టడికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని మంత్రి కోరారు.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 364కి చేరింది. వీరిలో 45 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. 11 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 308 యాక్టివ్ కేసులున్నాయి. మరో రెండు రోజుల్లో మర్కజ్ కేసులతో లింకున్న వారందరికీ పరీక్షలు పూర్తవుతాయని సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. మరో 110 వరకు పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాంటాక్ట్ కేసులు పెరిగితే కొంచెం అటు ఇటుగా పెరుగవచ్చని తెలిపారు.