నెరవేరని జగన్ కల.. నిమ్మగడ్డకు లైన్ క్లియర్

ఏపీలో పెండింగులో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఎట్టి పరిస్థితితుల్లోనూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హయాంలోనే జరిపించాలన్న వైసీపీ ప్రభుత్వ ప్రయత్నాలు నెరవేరలేదు. పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా నిమ్మగడ్డకు ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వంతో పాటు ఎస్ఈసీ నిమ్మగడ్డకూ ఆదేశాలు ఇచ్చింది. హై కోర్టు తీర్పుతో పరిషత్ ఎన్నికల నిర్వహణలో ఇప్పట్లో లేదని తేలిపోయింది. నిమ్మగడ్డకు రిటైర్మెంట్ […]

Written By: Srinivas, Updated On : March 23, 2021 1:19 pm
Follow us on


ఏపీలో పెండింగులో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఎట్టి పరిస్థితితుల్లోనూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హయాంలోనే జరిపించాలన్న వైసీపీ ప్రభుత్వ ప్రయత్నాలు నెరవేరలేదు. పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా నిమ్మగడ్డకు ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వంతో పాటు ఎస్ఈసీ నిమ్మగడ్డకూ ఆదేశాలు ఇచ్చింది. హై కోర్టు తీర్పుతో పరిషత్ ఎన్నికల నిర్వహణలో ఇప్పట్లో లేదని తేలిపోయింది. నిమ్మగడ్డకు రిటైర్మెంట్ కు సైతం లైన్ క్లియర్ అయ్యింది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు వైసీపీ సర్కారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ హయాంలోనే ఎట్టి పరిస్ధితుల్లోనూ ఈ పోరు జరపాలని వైసీపీ భావించింది. అయితే ఇందుకు పరిస్ధితులు మాత్రం సహకరించలేదు. గతంలో ఆపిన చోట నుంచి ఎన్నికలు తిరిగి నిర్వహించే విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉండటం, విపక్షాలు వ్యతిరేకిస్తున్న తరుణంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేని పరిస్ధితి. అయితే పరిషత్ పోరు నిర్వహించకుండా సెలవుపై వెళ్తున్నారంటూ.. నిమ్మగడ్డకు వ్యతిరేకాం ప్రభుత్వం దాఖలు చేయించిన పిటిషన్లకు హైకోర్టు నుంచి ఎదురు దెబ్బ తప్పలేదు.

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని ఎస్ఈసీకి ఆదేశాలు ఇవ్వాలంటూ.. దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఎన్నికలు జరిపించాల్సిందేనంటూ ఎస్ఈసీ ని ఆదేశించలేమని హైకోర్టు తెలిపింది. దీంతో ఈ నెలాఖరులోపు పరిషత్ పోరు నిర్వహించేలా నోటిఫికేషన్ ఇప్పించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు వృథా అయ్యాయి. నిమ్మగడ్డ హయాంలోనే పరిషత్‌ పోరు జరగాల్సిందేన్న ప్రభుత్వ వాదనకు హైకోర్టు ఒప్పుకోకపోవడంతో ఇక ఆయన తర్వాత వచ్చే ఎస్ఈసీతోనే ఈ ఎన్నికలు జరపాల్సిన పరిస్ధితి.

పరిషత్ ఎన్నికలు నిర్వహించకుండా.. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎలా రిటైర్డ్ అవుతారో చూస్తామనేలా ప్రభుత్వ పెద్దలు.. మంత్రులు నిన్న మొన్నటి వరకు వాదనలు చేశారు. అయితే హై కోర్టు తాజా ఉత్తర్వులతో పాటు ఈ కేసు విచారణ ఈనెల 30వ తేదీకి వాయిదా పడిపోవడంతో ఇక నిమ్మగడ్డ హయాంలో పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన ఈనెల 31న పదవీ విరమణ చేస్తారు. ఒకవేళ పరిషత్ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఉత్వర్వులు ఇచ్చినా.. ఆయన ఆగమేఘాలమీద ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలా జరగకపోవడంతో నిమ్మగడ్డ రిటైర్మెంట్ కు లైన్ క్లియర్ అయినట్లు చెప్పవచ్చు.