దేశాల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల ప్రపంచంలో కోవిడ్19 విజృభిస్తోందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడిలో ప్రపంచ దేశాల మధ్య సహకారం కొరవడినట్లు ఆయన తెలిపారు. ఒంటరిగా పోరాటం చేయాలన్న విధానంతో వైరస్ ను ఓడించలేక దేశాలు ఒడిపోయాయని ఆయన తెలిపారు. ఓ విూడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వ్లెడిరచారు. ఒంటరి పోరాటం వల్ల వైరస్ ను నియంత్రించలేమన్న విషయాన్ని ఆయా దేశాలు అర్థం చేసుకోవాలని, వైరస్ […]
Written By:
Neelambaram, Updated On : July 3, 2020 4:11 pm
Follow us on
దేశాల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల ప్రపంచంలో కోవిడ్19 విజృభిస్తోందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడిలో ప్రపంచ దేశాల మధ్య సహకారం కొరవడినట్లు ఆయన తెలిపారు. ఒంటరిగా పోరాటం చేయాలన్న విధానంతో వైరస్ ను ఓడించలేక దేశాలు ఒడిపోయాయని ఆయన తెలిపారు. ఓ విూడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వ్లెడిరచారు. ఒంటరి పోరాటం వల్ల వైరస్ ను నియంత్రించలేమన్న విషయాన్ని ఆయా దేశాలు అర్థం చేసుకోవాలని, వైరస్ నియంత్రణలో ప్రపంచ దేశాల సహకారం అవసరమన్నారు. చైనాలో మొదలైన కోవిడ్ ఆ తర్వాత యూరోప్, అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, భారత్ లోనూ విజృంభించిందన్నారు.
ఇప్పుడు రెండవ దశ మొదుకానున్నట్లు కొందరు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కోవిడ్ ను ఎదుర్కోవడంలో సహకారం లోపించినట్లు ఆయన చెప్పారు. అన్ని దేశాలను ఒక వేదికపైకి తీసుకురావాలని, ఆయా దేశాలు తమ సామర్థ్యాను ముందు పెట్టాలని.. చికిత్స, టెస్టింగ్ పక్రియ, వ్యాక్సిన్ అందుబాటు గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయాన్నారు. అలా అయితేనే మహమ్మారి కరోనాను ఎదుర్కొనగలమన్నారు.