బెంగాల్, అసోంలో తొలివిడత పోలింగ్ ఎంతంటే?

పశ్చిమ బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడుత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ముగిసింది. పశ్చిమ బెంగాల్ లో 30 నియోజకవర్గాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో కొన్ని చెదురుముదురు ఘనటలు చోటుచేసుకున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు బెంగాల్ లో 79.79 శాతం పోలింగ్ నమోదు కాగా.. అసోంలో 72.14 శాతం పోలింగ్ నమోదైంది. కరోనా నేపథ్యంలో మరో గంట పాటు పోలింగ్ సమయం పెంచడంతో సాయంత్రం 6 గంటలకు ఓటర్లను […]

Written By: NARESH, Updated On : March 27, 2021 8:04 pm
Follow us on

పశ్చిమ బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడుత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ముగిసింది.

పశ్చిమ బెంగాల్ లో 30 నియోజకవర్గాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో కొన్ని చెదురుముదురు ఘనటలు చోటుచేసుకున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు బెంగాల్ లో 79.79 శాతం పోలింగ్ నమోదు కాగా.. అసోంలో 72.14 శాతం పోలింగ్ నమోదైంది. కరోనా నేపథ్యంలో మరో గంట పాటు పోలింగ్ సమయం పెంచడంతో సాయంత్రం 6 గంటలకు ఓటర్లను అనుమతించారు.

పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మిడ్నాపూర్ లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సల్బోని పోలింగ్ బూత్ వద్ద సీపీఎం, బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరికి గాయాల్యాయి. మోహన్ పూర్ బూత్ వద్ద బీజేపీ, టీఎంసీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు.

ఇక అసోంలో 47 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. 72శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటలకు క్యూలైన్లో వేచి ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.

బెంగాల్ లో ఎనిమిది విడతల్లో, అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడుతలో ప్రశాంతంగా ముగిసింది.