Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu Lokesh Strategy: లోకేష్ కు అలా అవకాశం ఇచ్చిన చంద్రబాబు!

Chandrababu Naidu Lokesh Strategy: లోకేష్ కు అలా అవకాశం ఇచ్చిన చంద్రబాబు!

Chandrababu Naidu Lokesh Strategy: ఏపీలో( Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా టీటీడీ లడ్డుకు సంబంధించిన నెయ్యి కల్తీ వ్యవహారం అధికార, విపక్షం మధ్య గట్టి దుమారం రేపుతోంది. శాసనసభలో కేవలం కూటమి ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. శాసనమండలిలో మాత్రం కూటమి ఎమ్మెల్సీలతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. ఎందుకంటే శాసనమండలిలో కూటమికంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం ఎక్కువ. శాసనమండలిలో గట్టి మంటలే రేగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నిస్తోంది. అయితే అక్కడ ఒకే ఒక్కడుగా నారా లోకేష్ నిలుస్తుండడం విశేషం.

Also Read: ఖమేనీ ఖతం.. ఇజ్రాయెల్, అమెరికా ఇకనైనా యుద్ధం ముగిస్తాయా?

* శాసనమండలి వైపు చూడని బాబు
సాధారణంగా సీఎం చంద్రబాబు( CM Chandrababu) ఉభయసభల్లో పాల్గొనడం ఆనవాయితీ. కానీ ఎందుకో ఈసారి శాసనమండలి వైపు సీఎం చంద్రబాబు చూడడం లేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నుంచి శాసనమండలిలో మంత్రి లోకేష్ ఎక్కువగా కనిపిస్తున్నారు. కనీసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అటువైపుగా చూడడం లేదు. ఒకరిద్దరు మంత్రులు కూడా హాజరవుతున్నారు. కానీ వైసీపీ ఎమ్మెల్సీలకు చుక్కలు చూపిస్తున్నారు నారా లోకేష్. శాసనమండలిలో వైసిపి పక్ష నేతగా ఉన్న బొత్సతో ఢీ అంటే ఢీ అంటున్నారు లోకేష్. మాజీ మంత్రి అంబటి రాంబాబు ను అరెస్టు చేయడాన్ని లోకేష్ సమర్థించుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీల నోటికి తాళం పడేలా గట్టిగానే ఫైర్ అయ్యారు నారా లోకేష్. శాసనమండలిని లోకేష్ కు విడిచిపెట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు అర్థమవుతోంది.

* ప్రూవ్ చేసుకున్న లోకేష్..
ఈనెల 7 వరకు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు( assembly sessions ) జరగనున్నాయి. ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కావడంతో సుదీర్ఘంగా సాగాయి. అయితే శాసనమండలిలో ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని భావించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తమకున్న సంఖ్యా బలం ఒక వైపు.. శాసనమండలి చైర్మన్ మరోవైపు.. బొత్స సీనియారిటీ మరోవైపు.. ఇలా ముప్పేట కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టవచ్చని అంచనా వేసింది. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ లోకేష్ ధీటుగానే ఎదుర్కొన్నారు. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చిక్కుల్లో పడేశారు. శాసనమండలిపై లోకేష్ కు సమగ్ర అవగాహన ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీగా సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు. అక్కడ ఉన్న పరిస్థితులను ఆకలింపు చేసుకున్నారు. అయితే చంద్రబాబుతో పాటు పవన్ మాత్రం.. శాసనమండలి విషయంలో లోకేష్ కు విడిచిపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో నారా లోకేష్ తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నట్లు అయ్యింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version